E-Paper
Advertisement

ఏమంటివి.. ఏమంటివి..అన్నగారి డైలాగుతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ!

ఏమంటివి.. ఏమంటివి..అన్నగారి డైలాగుతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ!
Advertisement

Bhagyashri Borse: మోడల్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన పూణే ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తొలిసారి హిందీలో యారియాన్ 2 చిత్రంలో నటించి, ప్రేక్షకులను పలకరించిన ఈమె తొలిసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహా మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2024 లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. భాగ్యశ్రీ మాత్రం తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా హిందీ అమ్మాయి అయినప్పటికీ తన తొలి చిత్రానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. అలా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఆ తర్వాత కింగ్డమ్ అనే మరో తెలుగు చిత్రంలో నటించినది. ఇక చివరిగా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో నటించిన ఈమె.. ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

ఘనంగా అఖిల్ లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

అక్కినేని అఖిల్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఇప్పటికే ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్న అఖిల్ కెరీర్లో లెనిన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పాలి. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్.. ఈ సినిమాతో దుమ్ము దులపడం ఖాయం అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయడమే కాకుండా అఖిల్ లోని ఒక కొత్త నటుడిని ఈ చిత్రం బయటకు తీసింది. జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నేడు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

Advertisement

ALSO READ:” సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి”.. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

అన్నగారి డైలాగులతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ..

చిత్తూరు జిల్లా తిరుపతి వేదికగా.. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం అయింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి సందడి చేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగ్యశ్రీ బోర్సే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే కాదు తన డైలాగ్ డెలివరీతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

క్లిష్టమైన డైలాగును అవలీలగా చెబుతూ..

Advertisement

ఎన్టీఆర్ డైలాగ్ ను శివాజీ తో పాటు పోటీ పడుతూ చెప్పిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన దానవీరశూరకర్ణ లోని “ఏమంటివి ఏమంటివి” అనే డైలాగును గుక్క తిప్పుకోకుండా ప్రముఖ నటుడు శివాజీ తో కలసి చెప్పి అందరి చేత ఔరా అనిపించుకుంది. ముఖ్యంగా ఈ ఈవెంట్లో బ్లూ కలర్ చీర కట్టుకొని గ్లామర్ తో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా తన అద్భుతమైన డైలాగు డెలివరీతో అందరినీ ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఏది ఏమైనా పూణే అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అత్యంత క్లిష్టమైన డైలాగ్స్ ను ఏ మాత్రం ల్యాగ్ చేయకుండా చెబుతూ.. అందరి దృష్టిని ఆకర్షించింది భాగ్యశ్రీ. ప్రస్తుతం ఈమె చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ: ” సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి”.. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

Related News

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!

” సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి”.. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

అనిల్ నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా?

12 ఏళ్లుగా ఆయన ఫోటోనే నా మొబైల్ వాల్ పేపర్.. అసలు విషయం చెప్పిన అఖిల్!

61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్!

ఇండస్ట్రీలో ఘోర విషాదం..లెజెండ్రీ పాండవాని సింగర్ మృతి!

Kissik Talks Show : సిద్ధు వల్ల బాగా ఏడ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పు…

Big Stories

Advertisement
×