Brahmanandam: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాస్యం అంటే టక్కున గుర్తు వచ్చేది బ్రహ్మానందం. పేరులోనే ఉన్న ఆనందమే తెలుగు ప్రేక్షకులకి ఆయన గత కొన్ని దశాబ్దాలుగా పంచుతున్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉంటారు బ్రహ్మానందం. ఇక రీసెంట్ గా మోహన్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆ ఈవెంట్ కు బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో పొలిటిషన్ దయాకర్ బ్రహ్మానందంతో ఫోటో దిగుదామని అడిగారు అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువువలన ఫోటో వద్దు అనే ఉద్దేశంతో బ్రహ్మానందం పట్టించుకోకుండా తోసుకుంటూ వెళ్లిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. చాలామంది బ్రహ్మానందం ను తప్పుగా అపార్థం చేసుకోవడం మొదలుపెట్టారు.
ఆ వివాదం విషయం పైన బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే లేవగానే నేను ఒక వీడియో చూసి విపరీతంగా నవ్వుకున్నాను. నేను ఎర్రబెల్లి దయాకర్ రావుని ఫోటో కోసం వస్తుంటే పట్టించుకోకుండా తోసేసాను అని కొంతమంది అన్నారు. అని మొదలుపెట్టి వీడియో పైన క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం.
‘దయాకర్ తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నిన్న మోహన్బాబు నిర్వహించిన ఈవెంట్లో చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత దయాకర్ ఫొటోలకు ఆహ్వానించారు. అప్పటికే లేటవడంతో ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో సరదాగా అలా చేశా. దీన్ని కొందరు అపార్థం చేసుకున్నారు’ అని ఓ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: Bhagyashri Borse : కాంత సినిమా చూసాక నన్ను సావిత్రి గారితో పోల్చారు, భాగ్యశ్రీ పై ట్రోలింగ్ స్టార్ట్