Akhanda 2: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాబోతున్న సినిమాలలో అఖండ 2 సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మీద అంచనాలు క్రియేట్ అవ్వడానికి కారణం బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా విపరీతమైన సక్సెస్ సాధించాయి. అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తున్నారు.
ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ కూడా అంచనాలను పెంచుతుంది. ఈ సినిమాకి సంబంధించి రెండు టీజర్లు విడుదల చేశారు. అలానే ఒక ట్రైలర్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలానే పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి దుబాయిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఈ సినిమాకి తెలుగులో యు అండ్ ఏ సర్టిఫికెట్ వచ్చింది. మొత్తానికి ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. అలానే పలు రకాల స్పీచెస్ లో కూడా ఇదే విషయాన్ని బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ బయటికి చెప్పారు.
ఇక ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమాకి సెన్సార్ అడ్డంకులు వస్తున్నట్లు తెలుస్తోంది. చైనా వాళ్లను విలన్స్ గా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని కాపాడేది సైన్యం కాదు., సాధువులు అనే దానిపై కూడా అక్కడి సెన్సార్ అభ్యంతరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈరోజుల్లో మనోభావాలనేవి చాలా ఈజీగా దెబ్బతింటున్నాయి. కొన్ని డైలాగులు రాస్తున్న తరుణంలో కూడా ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడైతే సినిమాలు అనిపించింది అనిపించినట్లు తీయడానికి కూడా విపరీతమైన స్వేచ్ఛ ఉండేది. ఈ రోజుల్లో అది పోయింది. ఒక చిన్న పదానికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ముందుకు వచ్చే అనేక వర్గాలు ఉన్నాయి.
అయితే సాధువులని బాగా చూపించే క్రమంలో సైనికులను తక్కువ చేయటం అనేది ఈ సినిమాకి అడ్డంకుగా మారింది. అలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండుంటే ఈ సినిమాకి కూడా సేఫ్ గా దుబాయిలో సెన్సార్ జరిగిపోయేది.
Also Read : Drishyam 3 : థియేటర్ హక్కులకు 350 కోట్లా? బాలీవుడ్ సినిమాకు ధీటుగా నిలబడుతుందా?