MSVPG:ఈ మధ్యకాలంలో అభిమానులు తమ అభిమాన హీరో సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు భారీ ధరకు మొదటి టికెట్ ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే రూ.250 విలువచేసే టిక్కెట్ కి ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించడానికి కూడా వెనుకాడడం లేదు. అటు నిర్మాతలు కూడా స్టార్ హీరోల సినిమా టికెట్ వేలంపాట వేస్తూ బాగా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి దిగ్గజ హీరోల సినిమాల టికెట్ ను లక్షల రూపాయలకు దక్కించుకున్న అభిమానులు.. ఇప్పుడు అదే స్థాయిలో చిరంజీవి సినిమా టికెట్ ను అధిక స్థాయిలో వెచ్చించి దక్కించుకోవడం వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి హీరోగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. అటు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమలాపురంలో ఈ సినిమా మొదటి టికెట్ ను ఒక అభిమాని వేలం పాటలో ఏకంగా రూ.1.11 లక్షలకు సొంతం చేసుకున్నారు. అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో ఈ వేలం పాట జరగగా.. మెగా అభిమాని వెంకట్ సుబ్బారావు ఈ టికెట్ ను దక్కించుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
also read:Dilraju: దిల్ రాజు నిజ స్వరూపం బయటపెట్టిన తేజస్విని తమ్ముడు.. ఏమన్నారంటే?