Sunny Leone : బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకవైపు బాలీవుడ్ సినిమాలు, స్పెషల్ షోలతో పాటుగా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకుంది. అది మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడినట్లు ఓ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో కోడై కూస్తుంది. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ‘శివం అసోసియేట్స్’ భారీ ఆర్థిక కుంభకోణంలో ఈమె పేరు వినిపిస్తుంది.. అంతేకాదు ఆమెకు కర్ణాటక సీఐడీ నుంచి నోటీసులు కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ బ్యూటీతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.. ఎవరెవరికి నోటీసులు అందాయో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
కర్ణాటక బెళగావికి చెందిన ‘శివం అసోసియేట్స్’ భారీ కుంబకోణం గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు రూ. 2,400 కోట్ల భారీ పోంజీ కుంబకోణం జరిగింది. ఇందులో తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఈమెకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.. శివం అసోసియేట్స్ అధినేత శివానంద, ప్రజల సొమ్ముతో 2023లో ‘ఛాంపియన్’ అనే సినిమా తీశాడు. అందులో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేసింది. దీనికి గాను ఈమె భారీ పారితోషికం తీసుకుందని అధికారులు గుర్తించారు. దానికి వివరణ ఇవ్వాలని అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. త్వరలోనే వివరణ ఇవ్వాలని, లేదంటే మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.మరి దీనిపై ఈ హాట్ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి..
ఎంతోమందిని మోసం చేసిన శివం అసోసియేషన్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది.. ఇప్పటికే ఈ కేసులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయినా పలువురిని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కర్ణాటకలోని స్టార్స్ కు కూడా ఈ కేసులో భాగం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది.. బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ తో పాటుగా మరి కొంతమంది కన్నడ నటీనటులకు ఈ స్కామ్ సెగ తగులుతుంది. కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటులు ‘డాలి’ ధనుంజయ, వశిష్ఠ సింహలతో పాటు క్రేజీ హీరోయిన్లు సప్తమీ గౌడ, రాగిణి ద్వివేదిలతో పాటుగా పలువురు సెలబ్రిటీలకు సీఐడీ అధికారులు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.. బాధితుల సొమ్ము నుంచే వీరికి భారీ ఎత్తున పారితోషికాలు ముట్టాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వాళ్లకి కూడా వెంటనే వివరణ ఇవ్వాలని అధికారుల కోరినట్లు తెలుస్తుంది. మరి ఈ కుంభకోణం కేసులో ఇంకెంత మంది సెలబ్రిటీలు ఇరుక్కున్నారు అన్నది తెలియాల్సి ఉంది…