Dharma Mahesh: సినీ నటుడు, జిస్మత్ మండి అధినేత ధర్మ మహేష్ తన ఫుండ్ బ్రాండ్ని అతివేగంగా విస్తరిస్తున్నారు. గత నెల అమీర్ పేటలో గిస్మత్ నుంచి జిస్మత్గా తన కొత్త రెస్టారెంట్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు జగద్వాజపై ప్రేమతో అతడి పుట్టిన రోజు సందర్భంగా జిస్మత్ మండీని ప్రారంభించారు. రోజు వ్యవధిలోనే దీనికి ఫ్రాంచైజ్గా తాజాగా మరో బ్రాంచ్ని ప్రారంభించారు. ఎల్బీ నగర్ సమీపంలో చైతన్య పూరి కాలనీ లో మరో బ్రాంచ్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీని జిస్మత్ మండీ గా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. గిస్మత్ మండీకి రీబ్రాండింగ్ చేస్తూ జిస్మత్ మండీగా మార్చామని, ఇది నా నాణ్యత, భావోద్వేగం వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందన్నారు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుందని, కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాట్టు ధర్మ మహేష్ పేర్కొన్నారు.
ఆ పరివర్తన పూర్తయ్యే వరకు రెస్టారెంట్కి సంబంధించిన కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తున్నానని అన్నారు. తమ రెస్టారెంట్ లో ప్రతి బిర్యానీ ప్లేట్ మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయని, తాము అందించే రుచి, నాణ్యత ఆప్యాయత ఈ కొత్త తమ బ్రాండ్ని మరింత గుర్తింపు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్ ను బలోపేతం చేస్తుందని’ తాను విశ్వసిస్తున్నానని ధర్మ మహేష్ చెప్పుకొచ్చారు.