Dharma Mahesh Launch New Restaurant: హీరో ధర్మ మహేష్ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా కొత్త రెస్టారెంట్ కి శ్రీకారం చూట్టాడు. అమీర్ పేట్ జిస్మత్ జైలు మందీ పేరుతో కొత్త రెస్టారెంట్ ప్రారంభించాడు. తన తండ్రి, తల్లి చేతుల మీదు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. కాగా ఇవాళ (నవంబర్ 23) తన కొడుకు జాగద్వజ పుట్టిన రోజు సందర్భంగా కొడుకుకి అంకితం ఇస్తూ ఈ రెస్టారెంట్ ని ప్రారంభించినట్టు ధర్మ మహేష్ తెలిపారు.
హైదరాబాద్లోని అమీర్ పెట్లో నేడు (నవంబర్ 23) జిస్మత్ మండి రెస్టారెంట్ లాంచ్ చేశాడు. తన కొడుకు జాగద్వజ పుట్టిన రోజు సందర్భంగా కొత్త రెస్టారెంట్ని లాంచ్ చేశాడు. తన తండ్రి, తల్లి జ్యోతి ప్రజల్వన చేసి జిస్మత్ మండి రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ.. ఈ జిస్మత్ మండి తన కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టిందని, ఈ రీబ్రాండింగ్ గిస్మత్ నుంచి జిస్మత్గా పేరు మార్చినట్టు స్పష్టం చేశాడు.
ఇది నాణ్యత,వారసత్వం నుంచి ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందన్నాడు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుందని, ధర్మ మహేష్ కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. అలాగే ఈ రెస్టారెంట్ సంపూర్ణంగా, పరిపూర్ణమయ్యేవారకు దీనికి సంబంధించి అన్ని పనులను తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయని, మేము అందించే రుచి, నాణ్యత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయని అన్నాడు. ఈ కొత్త ప్రారంభం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్ ను బలోపేతం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానంటూ ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు.