SSMB29 : ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా SSMB29. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు.
ఇప్పటివరకు మహేష్ బాబు తెలుగులో మినహాయిస్తే మరో భాషలో సినిమాను చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఆ క్రేజీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
నెవర్ బిఫోర్ కంటెంట్
ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సెంథిల్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజమౌళి సినిమాలలో అతని సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వాళ్ళిద్దరికీ మధ్య అంత బాగా సింక్ కుదిరింది. అయితే ఈ సినిమాకి సెంథిల్ పని చేయడం లేదు. మరో సినిమాటోగ్రాఫర్ తో రాజమౌళి ముందుకు వెళ్తున్నారు. దీని గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు సెంథిల్. ఈ సినిమా మొదలుపెట్టడానికంటే ముందు ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత నెక్స్ట్ సినిమా వేరే వాళ్ళతో వెళ్ళబోతున్నాము అని ముందే చెప్పారట. అలానే ఈ సినిమాకి సంబంధించిన సెట్స్లోకి సెంథిల్ రెండుసార్లు వెళ్లారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడనిది ఈ సినిమాలో ఉండబోతుంది అంటూ సెంథిల్ ఈ సినిమా పైన నమ్మకాన్ని తెలియజేశారు.
మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
ప్రస్తుతం సెంథిల్ చెప్పిన మాటలతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు మహేష్ నుంచి ఒక సినిమా కూడా రాలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించలేదు అనే విషయం తెలిసిందే. కానీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటుంది. ఈ సినిమా ఇప్పుడు వచ్చుంటే బాగున్ను అని చాలామంది పలు సందర్భాల్లో అనుకున్నారు. థియేటర్లో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఆగస్టు 9న తెలుస్తుంది.
Also Read: Vijay Devarakonda: మీరు మారిపోయారు సార్, మాటల్లో ఎంతో మార్పు