E-Paper
Advertisement

Kaantha: ఊదేయడానికి దుమ్ము కాదు.. నేనొక పర్వతం.. కాంత ట్రైలర్ రిలీజ్!

Kaantha: ఊదేయడానికి దుమ్ము కాదు.. నేనొక పర్వతం.. కాంత ట్రైలర్ రిలీజ్!
Advertisement

Kaantha: ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) హీరోగా, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం కాంత. రానా, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా అనే మోజులో పడి.. డబ్బు, పలుకుబడి పెరిగిన తర్వాత మనిషిలో వచ్చే మార్పులను.. అహంకారాన్ని హైలెట్గా చేస్తూ తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే “ఊదేయడానికి నేను దుమ్మును కాదు.. పర్వతాన్ని” అంటూ హీరో చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా కాంత అంటూ వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ALSO READ:Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

కాంత ట్రైలర్ విషయానికి వస్తే..

Advertisement

“ఒక కథ ఎప్పుడు చెప్పాలన్నది.. ఆ కథే నిర్ణయిస్తుంది” అంటూ సముద్రఖని చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ” ఒక న్యూస్ దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్.. ఎవ్రీథింగ్ చేంజ్”.. ఇక తర్వాత డబ్బు, పరపతి, ఖ్యాతి వచ్చిన తర్వాత.. హీరో ప్రవర్తించిన తీరు.. “ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి ఇవన్నీ నిన్ను పాడు చేసేసాయి”.. వంటి డైలాగులు ఈ కథలోని డెప్త్ ను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా “ఈ అద్భుతమే” అనే పాట అందులోని మెలోడీ చాలా హాయిగా మనసులను తాకుతోంది. అని చెప్పవచ్చు. సినిమా నేపథ్యంలో సాగే కథ లాగా అనిపిస్తుంది. ఒక హీరోకి, దర్శకుడికి మధ్య చిన్న గొడవ వస్తుంది. ఆ గొడవ ఈ కథను ఎలాంటి మలుపులు తిప్పిందనేది ఈ కాంత మూవీ. ఇక ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్, దర్శకుడిగా సముద్రఖని నటించారు. అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రానా ఎంట్రీ అదిరిపోయింది. ఆయన గెటప్ కూడా ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చూస్తుంటే ఈ సినిమాలో మహానటి సినిమా ఫ్లేవర్ కనిపిస్తోంది అని చెప్పవచ్చు. పైగా ఇదొక డబ్బింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనే ఫీలింగ్ చూసే ఆడియన్స్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ట్రైలర్ తోనే అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

కాంత సినిమా విశేషాలు..

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాని రానా, దుల్కర్ సల్మాన్ కలసి నిర్మించడమే కాకుండా ఇందులో నటిస్తున్నారు కూడా.. వాస్తవానికి సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాలవల్ల ఇప్పుడు నవంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. అసలే రానా, దుల్కర్ సల్మాన్ సినిమాలు నిర్మిస్తున్నారు అంటే.. ఆ కథలో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇద్దరు కలిసి నిర్మించడమే కాకుండా నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×