E-Paper
Advertisement

Eesha Rebba: కారులోనే అమ్మ చనిపోయింది.. ఈషా రెబ్బా ఎమోషనల్!

Eesha Rebba: కారులోనే అమ్మ చనిపోయింది.. ఈషా రెబ్బా ఎమోషనల్!
Advertisement

Eesha Rebba: గ్లామర్ ప్రపంచంలో నవ్వుతూ కనిపించే తారల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. తెలుగు అమ్మాయిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ (Eesha Rebba) జీవితంలోనూ మర్చిపోలేని ఒక విషాదం ఉంది. తన ఎదుగుదలను చూసి మురిసిపోవాల్సిన తల్లి, షూటింగ్ సమయంలోనే అనూహ్యంగా కన్నుమూయడం ఆమెను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ గడ్డు కాలాన్ని తలచుకుంటూ తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా పంచుకున్న భావోద్వేగపూరితమైన విషయాలు ఇప్పుడు సగటు మనిషిని సైతం కదిలించేస్తున్నాయి.

కారులోనే కన్నుమూసిన కన్నతల్లి:

ఈషా రెబ్బ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె తల్లి హార్ట్ ఎటాక్‌తో మరణించారట. ఈషా మాట్లాడుతూ.. ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. అప్పుడే అమ్మకు హార్ట్ ఎటాక్ అంటే ఫోన్ వచ్చింది. ఈ విషయం విని షాక్ అయ్యాను మా నాన్న కూడా షాక్ లోకి వెళ్లిపోయారు.. అమ్మను ఇంటి నుండి హాస్పిటల్ కి కారులో తీసుకెళ్లే సమయంలో కార్ లోనే ఆమె చనిపోయారు. కేవలం 53 ఏళ్ల వయసులోనే నా తల్లి మరణించటం నన్ను మానసికంగా దిగ్భ్రాంతికి గురిచేసింది” అంటూ ఈషా చెప్పుకొచ్చింది.

బాధను దిగమింగుకుని సెట్స్‌లోకి:

Advertisement

అమ్మ అంటే ప్రాణమిచ్చే ఈషాకు ఆ మరణం కలిగించిన బాధ వర్ణనాతీతం. అయితే, ఒక నటిగా తన బాధ్యతను ఆమె విస్మరించలేదు. తన వల్ల షూటింగ్ ఆగిపోకూడదని, నిర్మాతలకు నష్టం కలగకూడదని భావించిన ఈషా, అమ్మ చనిపోయిన కేవలం 11 రోజులకే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కళ్లలో కన్నీళ్లు ఉన్నా, గుండె నిండా బాధ ఉన్నా.. అవన్నీ దిగమింగుకుని కెమెరా ముందుకు వచ్చి నటించడం ఒక నటిగా ఆమె అంకితభావాన్ని చాటిచెబుతోంది. ఆ సమయంలో తన తండ్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, ఆ కష్టకాలంలో కుటుంబం అంతా ఒకరికొకరు తోడుగా నిలిచామని ఆమె గుర్తుచేసుకున్నారు.

గతాన్ని తలచుకుంటూ భావోద్వేగం:

ఈషా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అమ్మ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని, ఆమె ఎమోషనల్ సపోర్ట్ తనకు చాలా అవసరమని చెప్పారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని కొనియాడారు. ఇప్పుడు తాను సాధిస్తున్న విజయాలను చూసేందుకు అమ్మ లేకపోవడం తనను ఎప్పుడూ బాధిస్తుంటుందని పేర్కొన్నారు. కేవలం వృత్తిపరమైన విజయాలే కాకుండా, కుటుంబ విలువలకు ఈషా ఇచ్చే ప్రాధాన్యత ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. తన తల్లి జ్ఞాపకాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని ఆమె ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇక తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతి:’ఈ శుక్రవారం రిలీజ్ అయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

also read: Eesha Rebba: ఇండస్ట్రీ అలాంటి వాళ్లకే సపోర్ట్ చేస్తుంది.. గుట్టురట్టు చేసిన ఈషా!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×