Girija Oak: చాలామంది టెక్నాలజీని చెడు దారిలో వినియోగించుకుంటున్నారు. దీనివల్ల కొంతమంది మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసి రాక్షసానందం పొందుతూ బ్లాక్మెయిలింగ్ లకి కూడా పాల్పడుతున్నారు. అలా తాజాగా ఓ నటికి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో దీనిపై ఆ నటి స్పందిస్తూ ఎమోషనల్ అయింది.మరి ఇంతకీ ఆనటి ఎవరంటే..మరాఠీ నటి గిరిజ ఓక్ గాడ్బోల్ . మరాఠీ హీరోయిన్ గిరిజ రీసెంట్గా బ్లూ కలర్ సారీ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.అయితే వీటిని ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి ఫోటోలను,వీడియోలను వైరల్ చేశారు కొంతమంది. దీంతో ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది..
నా స్నేహితులు,బంధువులు, మరియు పరిచయస్తులు చాలామంది నాకు పోస్టులు మరియు మీమ్ లను పంపుతున్నారు.వాటిలో కొన్ని హాస్యాస్పదంగా, సృజనాత్మకంగా ఉన్నాయి. కానీ కొన్ని ఏఐ మార్ఫింగ్ చేసిన నా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో వాళ్ళు నన్ను లైంగికంగా చూపించడం నాకు చాలా అసౌకర్యంగా ఉంది అంటూ ఎమోషనల్ అయింది.
అలాగే నేను ఈ డిజిటల్ యుగంలో ఉన్న వ్యక్తిని. నేను కూడా సోషల్ మీడియాను ఉపయోగిస్తాను కాబట్టి అది ఎలా పనిచేస్తుందో నాకు కూడా తెలుసు.ఈ రకమైన ఫోటోలు సాధారణంగా క్రియేట్ చేసి వైరల్ చేసేస్తారు. వీటిని కొంతమంది ప్రజలు క్లిక్ చేయడం, ఇష్టపడడం చేస్తారు. కానీ నన్ను బాధించే విషయం ఏమిటంటే..ఇలాంటి ఫోటోలకు ఎలాంటి నియమాలు ఉండవు. పరిమితులు దాటినట్లు కూడా అనిపించదు.. కానీ నాకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతను ఇంకా సోషల్ మీడియాని ఉపయోగించడు. కానీ కొద్ది రోజులయ్యాక అతను కూడా సోషల్ మీడియాని ఉపయోగిస్తాడు.అప్పుడు అతను పెద్దయ్యాక నా మార్ఫింగ్ ఫోటోలను చూస్తాడు.. అవి అప్పుడు కూడా ఇంటర్నెట్ లోనే ఉంటాయి.. ఆ టైంలో నా కొడుకు తన తల్లి అసభ్యకరమైన ఫోటోలను చూస్తే ఎలా ఉంటుంది. అయితే నా కొడుకుకి అవి రియల్ ఫోటోలు కాదు ఏఐ ద్వారా సృష్టించబడినవని తెలుసు.
also read:Andhra King thaluka: ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
ఇప్పుడు నా మార్ఫింగ్ ఫోటోలు చూసే వారికి కూడా అవి ఫేక్ ఫొటోస్ అని తెలుసు.అయినప్పటికీ ప్రజలు ఆ ఫోటోలను చూస్తూ థ్రిల్ అవుతారు. ఇది ఊహించుకుంటూనే చాలా భయానకంగా అనిపిస్తుంది. ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలను ఆపడానికి నేను ఏమి చేయలేనని నాకు తెలుసు. కానీ ఎలాంటి రియాక్షన్ తీసుకోకపోవడం కూడా సరైనది కాదు” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
అంతేకాదు ఇలాంటి కంటెంట్ ని క్రియేట్ చేసేవారు, షేర్ చేసే వారిని ఉద్దేశించి కూడా ఒక పోస్ట్ పెట్టింది.. అదేంటంటే.. మీరు ఏఐని ఉపయోగించి స్త్రీలు,పురుషులు లేదా ఎవరినైనా అనుచితంగా మార్చే వ్యక్తి అయితే దయచేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.మీరు ఈ కంటెంట్ ని సృష్టించకుండా దాన్ని వినియోగించడంలో ఆనందిస్తే మీరు కూడా సమస్యలో భాగమవుతారు.నేను మిమ్మల్ని మళ్లీ ఆలోచించుకోమని మాత్రమే అడగగలను.దాంతోపాటు నేను కూడా ఆకస్మిక శ్రద్ధతో ఆనందిస్తున్నాను. నా సినిమాలు సిరీస్ లేదా నాటకాలు ఎక్కువమంది చూడడానికి ఆసక్తి కనబరిస్తే నేను ఇంకా ఏమీ అడగగలను. మీరు నా సినిమాలకు సపోర్ట్ ఇస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీకు మంచి సినిమాలు అందిస్తూనే ఉండటానికి ప్రయత్నిస్తాను. థియేటర్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు” అంటూ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ వీడియోని కూడా పంచుకుంది.
అలా తన ఫోటోలని ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన వారికి ఎమోషనల్ గా విజ్ఞప్తి చేస్తూనే వారికి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక మరాఠీ నటి గిరిజ ఓక్ థెరపీ షెరపీ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో గుల్షన్ దేవయ్యతో కలిసి నటించింది.