E-Paper
Advertisement

Crime News: దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి

Crime News: దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి

Crime News: కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. మల్లేశం అనే 45 ఏళ్ల వ్యక్తి, మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన సొంత కుమారుడు ఆశ్రిత్ (17), కూతురు అర్చన (15)లను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.

అయితే పిల్లల తల్లి పని మీద బయటకు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరు లేరు ఇదే మంచి సమయం అనుకొని మానసిక స్థితి బాలేని ఇద్దరి పిలల్ని చంపేందుకు ప్రయత్నించాడు. అంతలోనే తల్లి ఇంటికి వచ్చేసరికి మల్లేశం పరారయ్యాడు. అయితే తల్లి పిల్లలు ఇద్దరు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి తట్టుకోలేక పోయింది. వెంటనే చుట్టు పక్కల వాళ్లని పిలవగా వారు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేశారు.

Also Read: జూబ్లీలో బంపర్ మెజారిటీ.. సీఎం రేవంత్ ఎత్తుగడలు, స్కెచ్‌లు..

పిల్లలని ఆసుపత్రిలో చికిత్స అందించారు. కానీ, చికిత్స పొందుతూ కూతురు అర్చన చనిపోయింది. కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే పిల్లల మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మల్లేశం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం అని తెలిపారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×