Gopi Galla Goa trip Pre release event: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన శైలి తో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేసే దర్శకులు ఉన్నారు. వాళ్లలో రోహిత్ అండ్ శశి మంచి పేర్లు సంపాదించుకున్నారు. వీళ్ళు చేసిన స్టోరీ డిస్కషన్స్, శీష్ మహల్, నిరుద్యోగ నటులు సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. అలానే గతంలో డబుల్ ఇంజన్ వంటి సినిమాలు కూడా చేశారు. ఇక వీళ్ళ దర్శకత్వంలో వస్తున్న గోపి గాళ్ళ గోవా ట్రిప్ సినిమా నవంబర్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి డైరెక్టర్ రోహిత్ మరియు శశి , మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్, నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ హాజరయ్యారు.
ఈ ఐడియా చెప్పిన 15 రోజు షూటింగ్ లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని ఒక రిమోట్ విలేజ్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిలిం. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ మధ్యలో షూటింగ్ చేసాం ఎక్కడ పర్మిషన్ లు కూడా లేవు. సినిమా 90% సినిమా అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఈ సినిమా.. చిల్డ్ బీర్ లాంటి మూవీ. ఇలాంటి మూవీని మీడియా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అని మాట్లాడారు.
జగదీష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది తను నటించిన నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్. దానికి రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పుష్ప సినిమా విపరీతమైన గుర్తింపు సాధించింది. వరంగల్ నుంచి హైదరాబాద్ కి సినిమాలు చూడడానికి వచ్చిన జగదీష్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో సెటిల్ అయిపోయాడు. నేను ఇక్కడ ఉండడానికి కారణం రోహిత్ మరియు శశి అని తెలిపాడు. సినిమా చూసి ఎంకరేజ్ చేయాలి అంటూ మాట్లాడారు.
ఈ సినిమా అనేది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మాగ్నమోపస్ లాంటిది. అంటూ ఎలివేషన్ తెలిపాడు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ అందరూ ఎంకరేజ్ చేయాలి అని కోరుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్ మరియు నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాను ఎంకరేజ్ చేయాలి అని ఆడియన్స్ ను కోరారు.
‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 14న ఏ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
Also Read: Ajith: స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు, గతంలో చాలామందికి