Ajith: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అసలు ఊహ కూడా అందటం లేదు. ప్రముఖ సెలబ్రిటీలు ఇల్లలకు బాంబు దాడులు గురించి బెదిరింపు కావాల్సి వస్తున్నాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సెలబ్రిటీలకు ఫోన్ చేసి బాంబు దాడి గురించి బెదిరింపులు చేస్తున్నారు.
గతంలో ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్, త్రిష, కమలహాసన్ వంటి ప్రముఖ సెలబ్రిటీలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటికి కూడా బెదిరింపులు వచ్చాయి. అయితే అప్పుడు నయనతార హైదరాబాద్ షూటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సినీ నటుడు అజిత్ కుమార్ ఇల్లు, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇలా గత కొంతకాలంగా వస్తున్న బెదిరింపు దాడులు గురించి తమిళ్ పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ ముఠాను అరెస్టు చేసి మీడియా ముందు పెడతారు చూడాలి అని చాలామందికి ఆత్రుతగా ఉంది. ప్రస్తుతానికి బెదిరింపులు అయినా కూడా ఒకవేళ అవి కానీ నిజం అయినట్లయితే ఇంకా సినిమా పరిశ్రమంలో విషాదఛాయలు అలుముకున్నట్లు అని చెప్పొచ్చు.
Also Read: Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే