E-Paper
Advertisement

Hema Malini: ధర్మేంద్ర మృతి.. హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్.. శూన్యత అంటూ!

Hema Malini: ధర్మేంద్ర మృతి.. హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్.. శూన్యత అంటూ!

Hema Malini: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈయన శ్వాస తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకున్నారు. ఇక ఈయన ఆరోగ్యం మెరుగు పడుతుందని ఇంటికి డిస్చార్జ్ చేశారు అయితే ఉన్నఫలంగా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల ఇండియన్ సినీ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.

ధర్మేంద్ర గొప్ప మార్గదర్శి..

తాజాగా తన భర్త మరణం పై నటి హేమమాలిని (Hema Malini)స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడమే కాకుండా ధర్మేంద్రతో తన అనుబంధం గురించి కూడా తెలియజేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా హేమామాలిని తన అధికారిక ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ధరమ్ జీ.. చాలా ప్రేమ గల భర్త. మా ఇద్దరూ కూతుర్లు ఈషా, అహానాకు ఎంతో ప్రియమైన ఆరాధ్యుడైన తండ్రి. వారికి తన తండ్రి అంటే ఒక గొప్ప స్నేహితుడు, తత్వవేత్త, ఒక మార్గదర్శి, గొప్ప కవి అని తెలిపారు. ధర్మేంద్ర తనకు మంచి, చెడు సమయంలోనూ అండగా నిలిచారని తెలియజేశారు. ధర్మేంద్ర ఎల్లప్పుడూ తన కుటుంబ సభ్యులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలగడమే కాకుండా వారందరి పట్ల ఎంతో ఆప్యాయతను చూపించేవారని హేమమాలిని తెలియజేశారు.

నాకు జరిగిన నష్టం వర్ణించలేనిది..

ఒక ప్రజా వ్యక్తిగా అతనికి ప్రతిభ , ప్రజాదరణ ఉన్నప్పటికీ ఆయన వినయం అతనిని ఉన్నత శిఖరానికి చేర్చాయని, చలనచిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర కీర్తి ప్రతిష్టలు, సాధించిన విజయాలు శాశ్వతంగా ఉంటాయని తెలిపారు. ధర్మేంద్ర మరణంతో వ్యక్తిగతంగా నాకు జరిగిన నష్టం మాటలలో చెప్పలేనిది. ఆయన మరణంతో నా జీవితం మొత్తం శూన్యత మిగిలి ఉంటుందని, ఇన్నేళ్లు కలిసి జీవితంలో ముందుకు సాగిన తర్వాత ఆ క్షణాలను తిరిగి పొందడం కోసం నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ హేమామాలిని తన భర్త మరణం గురించి ఎమోషనల్ అవుతూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇలా తన భర్త గురించి ఈమె వరుస పోస్టులు చేయడమ కాకుండా ధర్మేంద్రతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ధర్మేంద్ర మరణం తర్వాత హేమమాలిని మొదటిసారి ఆయన మరణాన్ని గుర్తుచేసుకొని తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వరుస పోస్టులను ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక ధర్మేంద్రకు హేమమాలిని రెండవ భార్య అనే సంగతి తెలిసిందే. మొదటి భార్యకు బాబీ డియోల్, సన్నీ డియోల్ అనే కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక హేమమాలినికి ఇద్దరు కూడా అమ్మాయిలు కావటం విశేషం. ధర్మేంద్ర 89వ సంవత్సరంలో కన్నుమూశారు. వచ్చే డిసెంబర్ నెలలో ధర్మేంద్ర 90వ వసంతంలోకి అడుగుపెట్టేవారు. ఈలోపు ఇలాంటి ఘటన జరగడంతో అభిమానులు కూడా ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగాపురం’ గా ఘట్టమనేని జయకృష్ణ మొదటి సినిమా..

 

Related News

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×