E-Paper
Advertisement

Raaja Saab Event : చెప్పిన టైంకి సాంగ్ రాలేదు, మేనేజ్ చేయలేక ఇబ్బంది పడిపోయిన మారుతి 

Raaja Saab Event : చెప్పిన టైంకి సాంగ్ రాలేదు, మేనేజ్ చేయలేక ఇబ్బంది పడిపోయిన మారుతి 
Advertisement

Raaja Saab Event : కొన్నిసార్లు కొన్ని ఈవెంట్ లో భారీగా డిజాస్టర్ అవుతుంటాయి. అందులో ఈరోజు జరిగిన ప్రభాస్ ది రాజా సాబ్ ఈవెంట్ ఒకటి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ముందుగానే అనౌన్స్ చేశారు. అయితే ఈ పాట మొదట 6:11 నిమిషాలకు వస్తుంది అని అనౌన్స్ చేశారు. ఆ టైం కు సాంగ్ విడుదల కాలేదు. ఆ తర్వాత 7:30 నిమిషాలకు విడుదలవుతుంది అని చెప్పారు. అప్పటికి కూడా సాంగ్ విడుదల కాలేదు.

హైదరాబాద్ బాలా నగర్ లోని విమల్ థియేటర్లో దీనికి సంబంధించిన ఈవెంట్ జరిపారు. ఐదు గంటలకి మొదలు అవ్వాల్సిన ఈవెంట్ లేటుగా మొదలైంది. అయితే చెప్పిన టైంకి సాంగ్ రాకపోవడంతో స్టేజి మీద అందరూ కూడా ఇబ్బంది పడిపోయారు. ఫ్యాన్స్ ని మేనేజ్ చేయలేక తేలిపోయారు.

మారుతి ఇబ్బంది పడ్డారు 

Advertisement

ఈ పాట కొద్దిసేపట్లో వస్తుంది అంటూ మారుతి మాట్లాడడం మొదలుపెట్టారు. స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా సాంగ్ రాకపోతే ఇంకా రెండు నిమిషాలు టైం పడుతుంది అంటూ మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు. మీ అందరికంటే ఎవరు పెద్ద ఫ్యాన్ అని మారుతి వాళ్లను అడిగారు నేను అని కొంతసేపు అభిమానులు అరిచారు.

ఆ తర్వాత అప్పటికి సాంగ్ వస్తుంది అనుకుంటే అక్కడ ఉన్న యాంకర్ మారుతిని కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. మారుతి వాటికి సమాధానం చెప్పడానికి సరిపోయింది. అప్పటికి కూడా రెండు నిమిషాలు అనుకున్న పాట విడుదలకు సిద్ధం కాలేదు.

Advertisement

ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ శశి కొంతసేపు మాట్లాడాడు. శశి మాట్లాడడానికి అంటే ముందు మారుతి నైజాంలో ఈ అనే చేస్తున్నారు 100 కోట్లు షేర్ చూపిస్తారు అంటూ కొంత సేపు మేనేజ్ చేశారు.

ఎస్ కే ఎన్ వలన కూడా కాలేదు

మరికొంతసేపు ఎస్కేఎన్ మారుతీ తో మాట్లాడుతూ ఒకసారి తొడ కొట్టు అంటూ చెప్పారు. అలానే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే మారుతి మాట్లాడుతూ నేను తొడ కొట్టడాలు, కాలర్ ఎగరేయడాలు వంటివి చేయను.

నాకు ఈ సినిమా విషయంలో చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ గారు నాకు వచ్చిన కామెంట్స్ అన్నీ చూసి నీకు గుడి కట్టేస్తారేమో డార్లింగ్ అని నాతో చెప్పారు. సినిమా మీరు ఊహించిన దాని కంటే వన్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది అని తన స్పీచ్ లో తెలిపారు మారుతి. అనుకున్న టైం కి సాంగ్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడిపోయారు.

Also Read: Bhagyashri Borse : కాంత సినిమా చూసాక నన్ను సావిత్రి గారితో పోల్చారు, భాగ్యశ్రీ పై ట్రోలింగ్ స్టార్ట్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×