Bhagya shri Borse:సినీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రామ్ పోతినేని (Ram Pothineni) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా చార్మింగ్ లుక్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రామ్.. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రీసెంట్గా రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ(Bhagya Shri )తో ఈయన ప్రేమలో పడ్డట్లు వార్తలు వినిపించాయి.
ఈ విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించకపోయినా.. నెటిజన్లు మాత్రం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే కామెంట్లు చేశారు. అయితే సడన్గా భాగ్యశ్రీ ఇటీవల తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన స్టోరీస్ నిజంగానే ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందా? అనే అనుమానాలు లేవనెత్తుతోంది. మరి భాగ్యశ్రీ చేసిన స్టోరీ లో ఏం పెట్టింది? అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇటీవల భాగ్యశ్రీ తన ఇంస్టాగ్రామ్ ఖాతా స్టోరీస్ లో “మన ప్లాన్స్ కన్నా.. దేవుడి ప్లాన్స్ చాలా బెటర్ గా ఉంటాయి” అంటూ పోస్ట్ చేసింది భాగ్యశ్రీ. దీంతో అందరి దృష్టి రామ్ పైనే పడింది. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారా? అంటూ రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇకపోతే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అటు రామ్ .. ఇటు భాగ్యశ్రీ ఎవరు కూడా మొదట స్పందించలేదు. కానీ భాగ్యశ్రీ ఆ తర్వాత కాలంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన లెనిన్ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన ప్రేమ విషయంపై ఇండైరెక్టుగా కన్ఫామ్ చేసింది. “ముఖ్యంగా తాను ఎంతోమంది హీరోలతో కలిసి నటించాను. అయితే వాళ్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నేను నటించిన హీరోలలో ఒక్కరు మాత్రమే సింగిల్.. వారితోనే నా ఏడు అడుగులు” అంటూ కామెంట్లు చేసింది. అయితే ఆ సమయంలో ఆమె రామ్ పోతినేని పేరు ప్రస్తావించలేదు. కానీ అక్కడ ఆమె నటించిన హీరోల జాబితాలో రామ్ మాత్రమే సింగల్ గా ఉండడంతో అందరూ రామ్ తో కలసి ఏడు అడుగులు వేయబోతోంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు సడన్గా భాగ్యశ్రీ ఇలా కామెంట్ పెట్టేసరికి బ్రేకప్ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం .
also read:రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!
లెనిన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి శివకుమార్ మురిగేషన్ దర్శకత్వం వహిస్తున్న గ్రామీణ భక్తిరస చిత్రం సేయోన్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆపరేషన్ గంగా అనే సినిమాలో కూడా ఈమె భాగమైంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.