E-Paper
Advertisement

Kalyani Priyadarshan: కథల కంటే వారికే ప్రాధాన్యత.. నిర్మాతలకు కళ్యాణి కౌంటర్!

Kalyani Priyadarshan: కథల కంటే వారికే ప్రాధాన్యత.. నిర్మాతలకు కళ్యాణి కౌంటర్!
Advertisement

Kalyani Priyadarshan:ప్రముఖ మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ చిత్ర నిర్మాత ప్రియదర్శన్, ప్రముఖ నటి లిస్సీ దంపతులకు 1993 ఏప్రిల్ 5న చెన్నైలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది.ఈమెకు తమ్ముడు కూడా ఉన్నారు. 2017లో అఖిల్ (Akhil) హీరోగా వచ్చిన ‘హలో’ సినిమా ద్వారా నటనా రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఈ సినిమాతో ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో సౌత్ ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత చిత్ర లహరి, రణరంగం వంటి చిత్రాలలో నటించిన ఈమె.. మళ్లీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కొంతకాలం తమిళ్లో నటించిన ఈమె.. ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీకే పరిమితం అయింది. కానీ గత ఏడాది మలయాళం ‘లోక చాప్టర్ వన్:చంద్ర’ పేరుతో తెలుగులో ‘కొత్తలోక’ అంటూ ప్రేక్షకులను మళ్లీ పలకరించింది.

నిర్మాతలపై ఊహించని కామెంట్స్..

ఇక ఇందులో తొలిసారి సూపర్ లేడీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. మలయాళంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో నన్ను ఉత్తేజపరిచేది ప్రేక్షకాదరణ ఒకటే కాదు.. స్వేచ్ఛ కూడా.. నేను కోరుకునే కథలను ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించడం. చాలా మంది నిర్మాతలు కథల కంటే కూడా స్టార్లకే ఎక్కువ మద్దతు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది. వారికి నేను కూడా అలాగే మద్దతునిస్తాను. నా కథల ఎంపిక విషయంలో స్వేచ్ఛ పొందుతాను” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే నిర్మాతలు కథల కంటే స్టార్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని కళ్యాణి ప్రియదర్శన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:R. Parthiban: త్రిష కౌంటర్ కు పార్థీబన్ రియాక్షన్.. తప్పు ఎవరిది?

కళ్యాణి ప్రియదర్శన్ సినిమాలు..

కళ్యాణి ప్రియదర్శన్ లోక చాప్టర్ 1 : చంద్ర చిత్రంతో మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు స్వయంగా కళ్యాణి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం జయం రవి, కృతి శెట్టి కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లో జెనీ అనే సినిమా వస్తోంది. అలాగే తమిళంలో దేవదర్శినితో పాటు తిరవియం ఎస్ ఎన్ దర్శకత్వం వహిస్తున్న థ్రిల్లర్ ప్రాజెక్టులో భాగమైంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె. ఇక వరుస అవకాశాలు అందుకొని.. మరింత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×