Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ ప్రచారకర్తగా ఆమె నియమితులయ్యారు. పిల్లల, మానసిక ఆరోగ్యం, హక్కుల కోసం సెలబ్రిటీ అడ్వకేట్ గా వ్యవహరించనున్నట్టు యూనిసెఫ్ ఇండియా ప్రతినిథి సింథియా మెక్ కాఫ్రీ ఆదివారం ప్రకటించారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులతో కలిసి కీర్తి సురేష్ ఈ కార్యక్రమంలో భాగంగా కానున్నారు. తనకు దక్కిన ఈ గౌరవంపై తాజాగా కీర్తి స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది.
పిల్లల శ్రేయస్సు మన బాధ్యత. మన పెంపకం, ప్రేమపూర్వక సంరక్షణ వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పునాది వేస్తుందని అభిప్రాయపడింది. మరింత ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి తోడ్పడుతుందని పేర్కొంది. .వారి నేపథ్యం, సామర్యంతో సంబంధం లేకుండ ప్రతి ఒక్కరి అభివృద్ధికి సమాజంలో అవగాహనకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం నాకు గౌరవగా ఉందని కీర్తి తన స్టేట్మెంట్ పేర్కొంది. కాగా నేను శైలజా చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ మహానటితో నేషనల్ అవార్డు అందుకుంది.
Welcome to the @UNICEF family, Keerthy Suresh. 🩵
We are thrilled to have you as our newest UNICEF India Celebrity Advocate.
Together, we’ll champion the rights and well-being #ForEveryChild in India.@KeerthyOfficial pic.twitter.com/DUPz7WJooS
— UNICEF India (@UNICEFIndia) November 13, 2025
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరి నటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆమె లీడ్ రోల్ పోషించింది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ చూసిన కీర్తి మహానటి సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకోవడమే కాదు.. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా తీసుకుంది. ఆ తర్వాత తమిళ, తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. రీసెంట్ బేబీ జాన్ చిత్రంతో గతేడాది బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ప్రస్తుతం రివాల్వర్ రీటా సినిమాలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ చిత్రంలో హీరోయిన్ నటిస్తుంది. పెళ్లి తర్వాత కీర్తి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.