E-Paper
Advertisement

Anantapur: హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహం కలకలం.. పక్కనే ఇడ్లీ పార్శిల్.. మిస్టరీగా మారిన మృతి

Anantapur: హాస్పిటల్ జనరేటర్‌లో మృతదేహం కలకలం.. పక్కనే ఇడ్లీ పార్శిల్.. మిస్టరీగా మారిన మృతి

Anantapur: అనంతపురం నగరంలో అత్యంత రద్దీగా ఉండే సాయినగర్ లో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా ఉన్న భారతీ హాస్పిటల్ వెలుపల ఏర్పాటు చేసిన జనరేటర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా ఆసుపత్రి పరిసరాల్లో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో, సిబ్బంది సోమవారం జనరేటర్ గదిని తెరిచి చూడగా, లోపల కుళ్లిపోయిన స్థితిలో ఒక శవం కనిపించింది. షాక్‌కు గురైన హాస్పిటల్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అనంతపురం టూ-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, సుమారు మూడు రోజుల క్రితం మరణం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసును మరింత జటిలం చేస్తూ, జనరేటర్‌లో డెడ్ బాడీ పక్కనే ఇడ్లీ చట్నీ పార్శిల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఆ వ్యక్తి జనరేటర్‌లోకి ఎందుకు వెళ్లాడు? ఆహారం తినడానికా? లేక చలికి రక్షణ కోసమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటన ఆసుపత్రి వర్గాల్లో, స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఎలా లోపలికి ప్రవేశించాడో తెలుసుకునేందుకు, గత మూడు రోజులుగా హాస్పిటల్, పరిసర ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శనివారం జనరేటర్ తెరిచినప్పుడు ఎవరూ లేరని సిబ్బంది చెబుతుండటంతో, ఆ తర్వాతే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. మృతుడి గురించి ఏవైనా వివరాలు తెలిస్తే వెంటనే టూ-టౌన్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.

Read Also: Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, పోలీసులకు గాయాలు

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×