E-Paper
Advertisement

MSVPG Film: చిరు సినిమాకు షాక్ ఇచ్చిన కోర్టు… ఆ లెక్కలన్నీ చెప్పాల్సిందే అంటూ!

MSVPG Film: చిరు సినిమాకు షాక్ ఇచ్చిన కోర్టు… ఆ లెక్కలన్నీ చెప్పాల్సిందే అంటూ!
Advertisement

MSVPG Film: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడం మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సినిమాలకు టికెట్లు రేట్లు పెంచకూడదన్నప్పటికీ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 11వ తేదీ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్లకు 600 రూపాయలు టికెట్ల రేట్లు నిర్ణయించారు. అలాగే 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పెంచిన టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

లెక్కల చిట్టా చెప్పాల్సిందే..

సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 50, మల్టీప్లెక్స్ లకు రూ.100 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఈ సినిమా టికెట్ల ధరలను అక్రమంగా పెంచారని ఇలా అక్రమంగా పెంచడం ద్వారా సుమారు 45 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారు అంటూ శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ నేడు జరిగింది. ఈ విచారణలో భాగంగా కోర్ట్ ఊహించని తీర్పు వెల్లడించింది. చట్ట విరుద్ధంగా సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల వచ్చిన 45 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని జిఎస్టి అధికారులకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

రూ. 45 కోట్ల ఆదాయం..

Advertisement

ఇలా రూ. 45 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కల వివరాలు చెప్పాలని తీర్పు వెల్లడించడంతో చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. ఈ విషయంలో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో కూడా టికెట్లు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా పెరిగిన టికెట్లు ధరలు ఏపీలో 10 రోజులు పాటు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన ఆదరణ రాబడుతుంది.

రికార్డు స్థాయిలో కలెక్షన్స్..

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా, విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్లలో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

Also Read: Anil Ravipudi: పిల్లలకు ఆ రీల్స్ చూపించొద్దు.. పేరెంట్స్ ను రిక్వెస్ట్ చేసిన అనిల్ రావిపూడి!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×