E-Paper
Advertisement

Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ

Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ
Advertisement

Kirshna Statue: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం అంశం వివాదాస్పదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా నోటీసులు జారీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహం ఏర్పాటు కోసం అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతే ప్రతిష్ఠ చేశామని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఈ విగ్రహాన్ని 2024 మార్చి నెలలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కలిసి అధికారికంగా ఆవిష్కరించారు. అయితే.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు విగ్రహం తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కృష్ణ అభిమానులు హైకోర్టును ఆశ్రయించగా.. విగ్రహం తొలగింపుపై కోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

స్టే ఉన్నప్పటికీ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే తీవ్ర నిరసనలు చేపడతామని అభిమాన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ వివాదంలో కృష్ణ అభిమానులకు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు మద్దతు ప్రకటించడం గమనార్హం. భీమవరం పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ అంశంపై మున్సిపల్ కార్పొరేషన్, అభిమాన సంఘాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని స్థానికులు కోరుతున్నారు.

ALSO READ: Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు

Advertisement

 

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×