E-Paper
Advertisement

Jr.NTR -Neel: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు రోజుకు కోటిన్నర ఖర్చు…భారీ హైప్ ఇచ్చిన ప్రొడ్యూసర్!

Jr.NTR -Neel: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు రోజుకు కోటిన్నర ఖర్చు…భారీ హైప్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
Advertisement

Jr.NTR -Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం డ్రాగన్ అనే టైటిల్ తో సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకుండా చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.

వారణాసి తరహాలోనే టైటిల్ లాంచ్..

ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ చిత్రబంధం మాత్రం ఈ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఇక మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారణాసి తరహాలోనే ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా హై యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది.

జోర్డాన్ షెడ్యూల్ కోసం కోట్ల రూపాయలు బడ్జెట్..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ మైత్రి నిర్మాతలలో ఒకరైన నవీన్ తెలిపారు. ఈయన పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి కీలక అప్డేట్ తెలియజేశారు ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ జోర్డాన్ (Jordan)లో పూర్తి అయిన సంగతి తెలిసిందే .అయితే ఈ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర నిర్మాతలు రోజుకు సుమారు కోటిన్నర వరకు ఖర్చుపెట్టినట్లు నవీన్ తెలిపారు.ఇలా ఈ ఒక్క షెడ్యూల్ కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విషయాన్ని నిర్మాత తెలియజేయడంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్..

Advertisement

ఇలా ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో సినిమా కోసం ఖర్చు చేశారు అంటే కచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర బృందం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈమె పాత్రకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగమైనట్టు తెలుస్తుంది.

Also Read: Rahul Ramakrishna: హుషారు 2 సినిమా షూటింగ్ లో రాహుల్ రామకృష్ణకు ప్రమాదం.. ఎలా ఉందంటే?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×