E-Paper
Advertisement

Naa Anveshana on Ibomma Ravi: ఐ బొమ్మ రవి దొంగ కాదు హీరో..హీరోలను ఏకి పారేసిన నా అన్వేష్!

Naa Anveshana on Ibomma Ravi: ఐ బొమ్మ రవి దొంగ కాదు హీరో..హీరోలను ఏకి పారేసిన నా అన్వేష్!
Advertisement

Naa Anveshana On Ibomma Ravi: ఐ బొమ్మ రవి(IBomma Ravi) ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.. సినిమాలను పైరసీలో విడుదల చేస్తూ ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే రవి పై దృష్టి సారించిన పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉన్నారు. ఇలా రవి అరెస్టు కావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయనపై విమర్శలు చేశారు. కానీ సోషల్ మీడియా వేదికగా రవికి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. అయితే తాజాగా ప్రముఖ యూట్యూబ్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ (Naa Anveshana) యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐ బొమ్మ రవి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఐ బొమ్మ రవికి మద్దతుగా అన్వేష్..

ఈ సందర్భంగా అన్వేష్ ఐ బొమ్మ రవికి పూర్తిస్థాయిలో మద్దతును తెలియజేస్తూ అతను దొంగ కాదని హీరో అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. రవి చేసిన పని తప్పు కాదని, ఉన్న వారి దగ్గర దోచుకొని లేనివారికి పెడుతున్నారు అంటూ అన్వేష్ తెలిపారు. అసలు దొంగలు సినిమా హీరోలే అంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల సినిమా హీరోలందరూ కలిసి సజ్జనార్ తో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో స్టార్ హీరోలు అందరూ కూడా పాల్గొన్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం రవిని హీరోగా పోలుస్తూ కామెంట్లు చేశారు.

అసలు దొంగ మూవీ రూల్జ్ ..

Advertisement

చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో ఉన్న వారి దగ్గర దోచుకుని పేదవారికి ఇచ్చారు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేశారు వీళ్లంతా దొంగతనాలు చేస్తే హీరోయిజం అంటారు అదే రవి చేస్తే దొంగ అంటారు అసలు దొంగలు ఎవరు అంటూ? ప్రశ్నించారు . రవి సినిమాలను పైరసీ చేస్తున్నారని తనని అరెస్టు చేశారు అయితే ఆయన జైలులో ఉన్నప్పటికీ కూడా సినిమాలు పైరసీలో వస్తున్నాయని అన్వేష్ తెలిపారు. అసలు దొంగ రవి కాదని, మూవీ రూల్జ్ (Movie Rulez)అని అన్వేష్ తెలిపారు. ఈ దొంగను పట్టుకోవడం బ్రహ్మదేవుడు తరం కూడా కాదు అంటూ ఈయన తెలియజేశారు.

Advertisement

ఇలా సినిమాలు పైరసీలోకి రావడానికి ప్రధాన కారణం మన హీరోలే అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఒకప్పుడు స్టార్ హీరోలు తక్కువ రెమ్యూనరేషన్ తో ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు కానీ ఇప్పుడు ఒక హీరో 100 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఒక్కో సినిమాకు మూడు సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు అలా ఎవరు సినిమాలు చేయమన్నారని ప్రశ్నించారు. ఓటీటీలు రావడం వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందనే విషయం గురించి కూడా ఈయన మాట్లాడారు. ఆన్లైన్ షాపింగ్ అందుబాటులో ఉన్నప్పటికి కస్టమర్లు షాపింగ్ మాల్ వెళ్లి కొంటున్నారు. ఎందుకు అక్కడ ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టడం వల్లే, అలాగే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి కూడా హీరోలు ఆఫర్లు ఇవ్వాలని అన్వేష్ తెలిపారు. కుటుంబం మొత్తం థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి అంటే అందుకు అనుగుణంగానే కొన్ని ఆఫర్లను కూడా ఇవ్వాల్సి ఉంటుందని అప్పుడే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు అంటూ అన్వేష్ తెలిపారు. కొంతమంది హీరోల రూపంలో పేదవారిని దోచుకుంటున్నారు అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఎంతోమంది అన్వేష్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Bandi Saroj: చస్తే హీరోగానే చస్తా .. విలన్ పాత్రలు చేయనన్న నటుడు..కానీ

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×