E-Paper
Advertisement

Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై టెన్షన్.. రాజా సాబ్ తప్పులు రిపీట్ కానున్నాయా..!

Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై టెన్షన్.. రాజా సాబ్ తప్పులు రిపీట్ కానున్నాయా..!
Advertisement

 Ustaad Bhagat Singh: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే పేరుతో సినిమాలను విడుదల చేస్తూ ముఖ్యంగా నిజాం ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకుంటోంది.
ఈ ప్రాంతంలో కొన్ని థియేటర్లను గ్రౌండ్ లీజ్ తీసుకుని మంచి సంఖ్యలో స్క్రీన్లను కూడా తమ చేతుల్లోకి తెచ్చుకుంది.

అయితే గతంలో రాజా సాబ్ సినిమా విడుదల సమయంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సినిమా ప్రీమియర్ షోలు చివరి నిమిషం వరకు ఓపెన్ కాకపోవడంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం వల్ల ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల మైత్రి సంస్థకు నైజాం ప్రాంతంలో కొంత ఆర్థిక నష్టం కూడా కలిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు అదే జరగనుందా..!

Advertisement

ఇప్పుడు అదే నైజాం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి సంస్థ స్వయంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 18న ఈ చిత్రానికి పేడ్ ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఈ సమయంలో మరో సినిమా ధురంధర్: ది రివెంజ్ కూడా పోటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన వెంటనే జాతీయ మల్టీప్లెక్స్ చైన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల విషయంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ కనీసం రెండు రోజుల ముందే ప్రారంభించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. టికెట్ ధరల పెంపు ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత రావాలి.

ఇది లాంగ్ వీకెండ్ కావడంతో మొదటి మూడు రోజుల కలెక్షన్లు మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే ధురంధర్: ది రివెంజ్ వంటి సినిమాతో పోటీ ఉండటంతో విడుదల ప్లానింగ్ చాలా కీలకంగా మారింది.

గతంలో రాజా సాబ్ సమయంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరిగితే నిజాం ప్రాంతంలో ఉస్తాద్ భగత్ సింగ్కు భారీ ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి మైత్రి సంస్థ మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

ALSO READ: Nayanthara: ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఇక బాలీవుడ్‌లో నయన్‌కు తిరుగులేనట్టే!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×