E-Paper
Advertisement

Kamareddy Missing Cases: భయం గుప్పిట్లో కామారెడ్డి.. గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు మిస్సింగ్

Kamareddy Missing Cases: భయం గుప్పిట్లో కామారెడ్డి.. గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు మిస్సింగ్
Advertisement

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకేసారి ఐదుగురు చిన్నారులు కనిపించకుండా పోవడం స్థానికంగా పెను కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాల పిల్లలు అదృశ్యం కావడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే రోజు ఇంతమంది చిన్నారులు మాయం కావడం వెనుక ఏదైనా కిడ్నాప్ ముఠా హస్తం ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

తొలుత గోసంగి కాలనీకి చెందిన అన్నదమ్ములు సింహాద్రి (10) అలాగే విజయ్ (09) నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చీకటి పడినా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీలో మరో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు.

Advertisement

ఆర్బీనగర్ కాలనీకి చెందిన సీపల్ (08) తో పాటు ఆమె చెల్లెళ్లు ఆయాత్ (07) ఇంకా మరియం (05) ఈరోజు మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. గంటలు గడుస్తున్నా పిల్లలు ఇంటికి చేరకపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. జిల్లాలో వరుసగా ఐదుగురు చిన్నారులు కనిపించకుండా పోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న ఏఎస్పీ చైతన్య రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

ఘటనా స్థలాలను సందర్శించిన ఏఎస్పీ బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు అలాగే కాలనీల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. చిన్నారుల అదృశ్యంతో కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు దేవుడిని వేడుకుంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

ALSO READ: Civils Ranker: సివిల్స్‌లో సత్తా చాటిన పెద్దపల్లి జిల్లా యువతి, పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్, ఏడేళ్ల కష్టానికి ఇది ఫలితం..

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×