E-Paper
Advertisement

Nayanthara: ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఇక బాలీవుడ్‌లో నయన్‌కు తిరుగులేనట్టే!

Nayanthara: ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఇక బాలీవుడ్‌లో నయన్‌కు తిరుగులేనట్టే!
Advertisement

Nayanthara: పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నయనతార (Nayanthara) స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. ఆమె వరుస సినిమాలతో దూసుకెళుతోంది. మొన్నటి వరకు లేడీ ఓరియంటెడ్ పాత్రలకే ఓకే చెప్పిన నయనతార, ఇప్పుడు ఇతర హీరోల చిత్రాలలో చేయడానికి కూడా రెడీ అంటోంది. ఆ క్రమంలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu), ‘టాక్సిక్’ (Toxic) వంటి చిత్రాలలో ఆమె నటించింది. ఒక సౌత్‌లోనే కాకుండా, బాలీవుడ్‌లోనూ నయనతార చక్రం తిప్పుతోంది. ‘జవాన్’ (Jawan)తో బాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్ అందకున్న నయనతారకు అక్కడి నుంచి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయనేలా టాక్ నడుస్తోంది. రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో సెన్సేషనల్ సక్సెస్‌ని నయనతార తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన నటించిన ‘టాక్సిక్’ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

Also Read- Unity: కొండాలక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డ్.. టీమ్ స్పందనిదే!

ముంబై మీడియా హౌస్ సంప్రదింపులు

Advertisement

తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ మీడియా హౌస్ లేడీ సూపర్ స్టార్‌తో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే.. బాలీవుడ్‌లో కూడా నయనతారకు తిరుగులేనట్టే. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ హీరోయిన్లు, మరీ ముఖ్యంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్లు ఇప్పుడు అరుదుగా మారిపోయారు. అందుకే సౌత్‌కు చెందిన నయనతారతో సినిమా చేసేందుకు ముంబైకి చెందిన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మినీ ఫిల్మ్స్ (Mini Films) నయనతారతో ఒక భారీ బడ్జెట్ కోసం సంప్రదింపులు జరుపుతోందనేలా సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Also Read- Rashmika Mandanna: రాహులా.. అవార్డు కొట్టాం! గద్దర్ అవార్డ్‌పై రష్మిక

యాక్షన్‌ నిండిన స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ

Advertisement

గతంలో ‘ఫోరెన్సిక్’, ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ వంటి విభిన్నమైన, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మించిన మినీ ఫిల్మ్స్, ఇప్పుడు తమ తదుపరి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాత మన్సీ బాగ్లా (Mansi Bagla) తన క్రియేటివ్ విజన్‌తో భారీ యాక్షన్‌ నిండిన స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు నయనతార అయితేనే పర్ఫెక్ట్ అని వారు భావిస్తున్నారట. నయనతారకు ఉన్న గ్రేస్, సీరియస్ రోల్స్‌ను పండించే సత్తా, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ అవుతాయని నిర్మాత మన్సీ బాగ్లా భావిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందనేలా ముంబై మీడియాలో కూడా వార్తలు రన్ అవుతున్నాయి. నయనతార వరకు కథ వెళ్లిందని, ఆమె ఓకే అంటే సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం అన్నట్లుగా మిలీ ఫిల్మ్స్ యూనిట్ వేచి చూస్తోందని తెలుస్తోంది. చూద్దాం.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..

Also Read- Anil – Venky: వెంకటేష్ కొత్త మూవీలో నేషనల్ విన్నింగ్ హీరోయిన్.. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×