E-Paper
Advertisement

ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఘోర విషాదం.. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ప్రముఖ నటుడు!

ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఘోర విషాదం.. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ప్రముఖ నటుడు!
Advertisement

Fauji Shoot: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్.ఈ క్రమంలో హనురాఘవపూడి  దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ సినిమా ఫౌజీ షూటింగ్ జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది కూడా.1940 కాలం నాటి వార్ బ్యాక్ డ్రాప్ లో మైత్రి మూవీ మేకర్ ప్రెస్టేజ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి .

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో  స్పీడ్ గా జరుగుతోంది.అయితే ఈ సినిమా సెట్స్ లో ఒక ఊహించని సంఘటన జరగడం ఫ్యాన్స్ ని ఆందోళనకి గురిచేస్తుంది.ఈ సినిమాలో కీ రోల్  పోషిస్తున్న బాలీవుడ్ యాక్టర్ రాజేష్ శర్మ ఒక ప్రమాదకరమైన విషపురుగు కాటుక గురై ప్రస్తుతం ఐసీయూలో చావుతో పోరాడుతున్నాడు.మామూలుగా సినిమా సెట్స్ లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం కామన్.

Advertisement

రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటుచేసిన భారీ సెట్లో

కానీ రాజేష్ శర్మ విషయంలో జరిగిన ఈ ప్రమాదం ఇండస్ట్రీవర్గాలని షేక్ చేస్తుంది.రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటుచేసిన భారీ సెట్లో  తనకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్  ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు రాజేష్ శర్మ.అయితే ఆ సమయంలో ఇతర నటులు టెక్నిషియషన్స్ తో సరదాగా గడిపిన సమయంలో ఒక విషపు పురుగు ఆయన కుడికాలి పాదంపై కుట్టింది.అయితే ఆ సమయంలో అది మామూలు పురుగే  అనుకున్న రాజేష్ శర్మ దానిని  పెదగా పట్టించుకోలేదు. ఇక షూటింగ్ హడావిడిలో ఉండటం అంతా  లైట్ తీసుకున్నారు .కానీ పురుగు కుట్టిన ఆరు గంటల తర్వాత రాజేష్ శర్మ బాడీలో విషం ప్రభావం చూపించడం ప్రారంభించింది.

Advertisement

కుడి కాలి పాదంలో భరించలేని మంటతో పాటు ఒళ్లంతా విపరీతమైన నొప్పులు మొదలయ్యాయి.అంతలోనే ఒక్కసారిగా వణుకుతో కూడిన హై  ఫీవర్ అవడంతో ఆయన పరిస్థితి విషమించింది .దీతో కంగారుపడిన ఆయన వెంటనే హైదరాబాద్ నుండి తన ఊరైన  కోల్ కతా కి వెళ్లే క్రమంలో ఫ్లైట్ ఎక్కారు.అయితే దురదృష్టవశాత్తూ విమాన ప్రయాణంలో ఉండగానే ఆరోగ్యం మరింత క్షీణించింది .శరీరంలోకి చేరిన విషం రక్తంలో కలవడం వల్ల ఫ్లైట్లోనే ఆయన షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా  పెరిగిపోయాయి .దీనికి తోడు ఊపిరాడక శ్వాస తీసుకోవడం మరింత కష్టమవడంతో  విమానంలోనే ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారు.

ఐసియుకు మార్చి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్

ఇక కోల్ కతాఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవడంతోనే విమాన  సిబ్బంది మరియు ఆయన కుటుంబ సభ్యులకు ఆయనని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.రాజేష్ శర్మను పరిశీలించిన  డాక్టర్స్ మాట్లాడుతూ ఆ విష పురుగు కుట్టిన కారణంగానే ఆయన పాదం నుండి మోకాలు వరకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, రక్తం కూడా ఇన్ఫెక్షన్ కి గురైందని తెలిపారు.ఫీవర్ అసలు తగ్గకపోవడం ఇన్నర్ ఆర్గాన్స్ పై ప్రెజర్ పడటంతో  వైద్యులు ఆయనను ఐసియుకు మార్చి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.

also read:టాలీవుడ్‌లో మరో డైరెక్టర్-హీరోయిన్ లవ్ ట్రాక్.. సైలెంట్‌గా పెళ్లి పీటల వైపు అడుగులు!

ఇక రాజేష్ శర్మ సినిమాల విషయానికొస్తే ది డర్టీ పిక్చర్’, ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘తాను వెడ్స్ మాను రిటర్న్స్’ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో  బాలీవుడ్ లో సత్తా చాటారు. ఇక ఇప్పుడు  ప్రభాస్ సరసన ఫౌజీ లాంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలో నటిస్తున్న ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం .

Related News

బాలీవుడ్‌ను కుదిపేసిన ఆత్మహత్య: 18 ఏళ్లకే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్..

టాలీవుడ్‌లో మరో డైరెక్టర్-హీరోయిన్ లవ్ ట్రాక్.. సైలెంట్‌గా పెళ్లి పీటల వైపు అడుగులు!

‘మనం’ తర్వాత మళ్లీ అఖిల్ కోసమే …నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

కన్నీరు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమాని స్టోరీ.. ‘ఓజీ 2’ టీమ్ తీసుకున్న నిర్ణయానికి అంతా ఫిదా!

సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !

స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?

Big Stories

Advertisement
×