E-Paper
Advertisement

The Raja Saab Pre release:  15 ఏళ్ల తర్వాత ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నా.. ప్రభాస్ స్పీచ్ వైరల్!

The Raja Saab Pre release:  15 ఏళ్ల తర్వాత ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నా.. ప్రభాస్ స్పీచ్ వైరల్!
Advertisement

The Raja Saab Pre release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈయన నటించిన ది రాజా సాబ్ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ముందుగా సుమా గురించి ప్రభాస్ మాట్లాడారు సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని ఆవిడ ఈవెంట్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ జోష్ ఇస్తుంది అంటూ తనపై ప్రశంసల కురిపించారు. జరీనా వాహబ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మా నాన్నమ్మ. మా నాన్నమ్మ సీన్స్ చూసి నేను కూడా నా సీన్స్ మర్చిపోయానని ప్రభాస్ తెలిపారు.

క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది..

ఈ సినిమా ద్వారా నేను మా నానమ్మ ఫ్యాన్ అయిపోయానని ,ఇది నానమ్మ మనవడి కథ అంటూ తెలియజేశారు .ఇక హీరోయిన్ల గురించి అలాగే దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ గురించి, తమన్ గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఇక ఈ సినిమాకు ముందు మారుతిని కలిసిన తర్వాత అన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అభిమానుల కోసం ఇవ్వాలి అని అడిగాను. ఫైనల్లీ మారుతి నాకోసం హర్రర్ కామెడీ తీసుకువచ్చారని, మారుతి గారి రైటింగ్ కు తాను ఫ్యాన్ అయిపోయానని తెలిపారు . ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా సినిమా పట్ల అంచనాలను పెంచేస్తూ మాట్లాడారు.

సీనియర్ల తర్వాతే మేము..

Advertisement

దాదాపు 15 ఏళ్ల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ఇక ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత మీదేనని తెలిపారు . అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సంక్రాంతి సినిమాల గురించి కూడా ప్రభాస్ మాట్లాడారు. ఈ సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని తెలిపారు. ఇక సంక్రాంతి బరిలో కూడా సీనియర్ల తర్వాతనే మేము అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలతో పాటు మా సినిమాని కూడా సక్సెస్ చేయండి అంటూ ఈయన తెలియచేశారు.

Advertisement

ఇక ప్రభాస్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా బాహుబలి వచ్చాడంటూ నినాదాలు చేయడంతో ప్రభాస్ వెరైటీగా స్పందించారు నేను మాట్లాడుతుంటే అందరికీ బోర్ కొడుతుంది కదా అందుకే ఇలా బాహుబలి డైలాగ్ చెబుతున్నారు అంటూ సరదాగా ఆట పట్టించారు. మీకోసం ఓసారి బాగా మాట్లాడుతాను స్టేజ్ పైనే ఎంటర్టైన్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పటిలాగే అభిమానుల పట్ల చూపించిన ప్రేమకు అభిమానులకి ఫిదా అవుతున్నారు.

Also Read: The Raja Saab Pre release: కన్నీళ్లు పెట్టుకున్న మారుతి.. ఓదార్చిన ప్రభాస్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×