Ram Charan Twins: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మెగా పవర్ స్టార్’గా వెలుగుతున్న రామ్ చరణ్ మరియు ఆయన ధర్మపత్ని ఉపాసన కొణిదెల దంపతుల ఇంట్లో ఇప్పుడు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇటీవలే కవల పిల్లలకు (ఒక కుమారుడు, ఒక కుమార్తె) జన్మనిచ్చిన ఈ దంపతులు, తాజాగా తమ బిడ్డలకు అర్థవంతమైన పేర్లను ఖరారు చేశారు.
రామ్ చరణ్, ఉపాసన తమ కుమారుడికి ‘శివరామ్’ అని, కుమార్తెకు ‘అన్వీరా దేవి’ అని నామకరణం చేశారు. ఈ పేర్లు వినడానికి ఎంతో సంప్రదాయబద్ధంగా ఉండటమే కాకుండా, మెగా కుటుంబం దైవచింతనను, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది (2023) జన్మించిన వీరి మొదటి కుమార్తె ‘క్లిన్ కారా కొణిదెల’ పేరు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కవలల పేర్లు కూడా అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.
ఈ కవల పిల్లలు ఈ ఏడాది జనవరి 31వ తేదీన జన్మించారు. అయితే, వీరి జనన సమయం విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ జ్యోతిష్యుడు మహేష్ బాంగ్ సూచనల మేరకు, పిల్లల పుట్టుకకు అత్యంత శుభప్రదమైన సమయాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. జనవరి 31వ తేదీ రాత్రి 11:30 గంటల తర్వాత సమయం పిల్లల భవిష్యత్తుకు గ్రహగతులకు అనుకూలంగా ఉంటుందని ఆయన సూచించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఉపాసన సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పేర్కొన్నారు.
Read also-Funky Twitter Review : ‘ఫంకీ’ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ హిట్ కొట్టాడా..?
పిల్లల నామకరణం వారి రాకపై రామ్ చరణ్ స్పందిస్తూ.. “మాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలగడం ఎంతో సంతోషంగా ఉంది. మా జీవితంలో ఉన్న మహిళలే మాకు గొప్ప బలం. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు” అని తెలిపారు. అలాగే, తమ పిల్లల భద్రతను మరియు ప్రైవసీని గౌరవించాలని ఉపాసన అభిమానులను కోరారు. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, పద్కొండేళ్ల తర్వాత 2023లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు ‘శివరామ్’, ‘అన్వీరా దేవి’ల రాకతో మెగా ఫ్యామిలీ పూర్తిస్థాయిలో కళకళలాడుతోంది. చిరంజీవి గారి మనవడు, మనవరాళ్ల రాకతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.