RC17 Update: రంగస్థలం.. అప్పటివరకు చరణ్ నటన మీద ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసిన సినిమా ఇది.అలాంటి కాంబోలో సినిమా వస్తుందంటే మూవీ లవర్స్ లో ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో ఉండే క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. ఇక ఇదివరకే మా కాంబినేషన్ లో RC 17 అనే వర్కింగ్ టైటిల్ తోసినిమా వస్తుంది అంటూ వీరిద్దరు అనౌన్స్ చేశారు కూడా.ఇక పెద్ది కూడా రిలీజ్ రిలీజ్ అయిపోవడంతో చరణ్, సుక్కు కాంబోలో వచ్చే సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వరకు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఒక క్రేజీ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.అదే ఈ సినిమా వచ్చే ఏడు దసరాబరిలో దిగుతుందని.
also read :ముదురుతోన్న ‘స్పిరిట్’ టైటిల్ వివాదం… ఆపేస్తామంటూ ఓపెన్ వార్నింగ్!
వచ్చే ఏడు దసరాబరిలో
అవును అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాని వచ్చే ఏడు దసరాబరిలో దించనున్నాడట సుక్కు .ఒకవేళ అదే అదే నిజమైతే మాత్రం చరణ్ కి మరో హిట్ పడ్డట్టే అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్ .ఎందుకంటే గతంలో చరణ్ నటించిన మగధీర, ధ్రువ అనే సినిమాలు పండగ సీజన్లో వచ్చి భారీ హిట్లు కొట్టినవే .సో ఇప్పుడు మళ్లీ సుకుమార్ మార్క్స్ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అయితే దసరా సీజన్ అభిమానులకు పూనకాలు తెప్పించడం పక్కా.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా
అంతేకాదండోయ్ ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించబోతుందన్న వార్త కూడా ఇబ్బడి ముబ్బడిగా తిరిగేస్తుంది.అయితే ఇప్పట్లా గ్లామర్ పాత్రలో కాకుండా ఈసారి సినిమా కథని మలుపుతిప్పే అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతుందని సమాచారం.నిజానికి చెప్పాలంటే సుక్కు సినిమాల్లో ఆడపాత్రలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు .రంగస్థలంలో పుష్ప లో అనసూయ ఎలా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే .ఇప్పుడు అలాంటి ఓ పాత్రనే సుక్కు వచ్చే చరణ్ సినిమా కోసం డిజైన్ చేశాడని టాక్ .ఒకవేళ సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం సినిమా లెవెల్ మరో రేంజ్ కి చేరటం ఖాయం.
also read :అయ్యగారి ఖాతాలో 100 కోట్ల సినిమా పడ్డట్టేనా ?
నిజమవుతాయో లేక రూమర్స్ గా మిగిలిపోతాయో !
ఇక ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నట్టుగా ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా రూటేడ్ అండ్ రస్టిక్ నేటివిటీ డ్రామాగా ప్లాన్ చేశాడట సుకుమార్.అంటే రంగస్థలంలో గోదావరి యాసతో మెప్పించిన చరణ్ ఈసారి తెలంగాణ యాసతో ఊర మాస్ ఊర మాస్ లుక్ లో ఆడియోన్స్ ని అలరించనున్నాడన్నమాట.ఇక ఈ సినిమాకి సుక్కు తనకు అచ్చొచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ని కాకుండా అయితే తమన్ లేదంటే సాయి అభ్యంకర్ లని ఆన్ బోర్డ్ చేయనున్నాడని విశ్వాసనీయ వర్గాల సమాచారం.చూడాలి మరి సోషల్ మీడియాలో సర్కిలేట్ అవుతున్నట్టుగా ఈ వార్తలు నిజమవుతాయో లేక రూమర్స్ గా మిగిలిపోతాయో !