MS Dhoni radio receiver: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India Vs England Team ) మధ్య ఇవాళ 3 వన్డేల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఇవాళ తొలి మ్యాచ్ ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయగా, టీమిండియా ఛేజింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ (Edgbaston, Birmingham) వేదికగా జరగగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (MS Dhoni) కూడా హాజరయ్యారు. తన కుటుంబ సభ్యులతో మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని చెవిలో రేడియో రిసీవర్ (MS Dhoni radio receiver) పెట్టుకొని దర్శనమిచ్చారు. దీంతో ఈ రేడియో రిసీవర్ పరికరం ఎందుకు పెట్టుకున్నాడని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు చర్చిస్తున్నారు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభమైన నేపథ్యంలో వరల్డ్ కప్ హీరో మహేంద్రసింగ్ ధోని దర్శనమిచ్చారు. ఈ మ్యాచ్ తిలకించేందుకు తన సతీమణి సాక్షి తో కలిసి స్టేడియానికి వచ్చి మెరుసారు మహేంద్రసింగ్ ధోని. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీని చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. అయితే ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని తన చెవిలో రేడియో రిసీవర్ పెట్టుకున్నారు. రేడియో రిసీవర్ ద్వారా మ్యాచ్ తిలకించారు.
ఈ క్రమంలో ఈ రేడియో రిసీవర్ ఎందుకు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సాధారణంగా మైదానంలో జరుగుతున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూస్తున్న క్రమంలో… జనాలు బాగా అరుస్తూ ఉంటారు. అయితే ఈ అరుపుల మధ్య కామెంట్రీ వినడానికి ఈ రేడియో రిసీవర్ పనికి వస్తుంది. క్రికెటర్లు స్టేడియంలో మ్యాచ్ చూసేటప్పుడు ఈ పరికరాన్ని వాడుతారు. అంతేతప్ప ఇందులో పెద్ద సైన్సు ఏం లేదు. గతంలో కూడా మహేంద్రసింగ్ ధోని ఇలాంటి రేడియో రిసీవర్ పెట్టుకొని మ్యాచ్ తిలకించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మహేంద్ర సింగ్ ధోని ధరించిన రేడియో రిసీవర్ ధర దాదాపు 1500 రూపాయల వరకు ఉంటుంది. అయితే దిగ్గజ క్రికెటర్లు స్టేడియాలకు వచ్చినప్పుడు… అక్కడి క్రికెట్ బోర్డులు ఈ రేడియో రిసీవర్లను అందిస్తాయి. ప్రత్యేకంగా వీటిని కొనుగోలు చేయాల్సిన పనిలేదు. ఇక టీవీలలో మనం మ్యాచ్ తిలకిస్తే దాదాపు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారం అవుతూ ఉంటుంది. కానీ ఈ రేడియో రిసీవర్ ద్వారా ముందుగానే మనకు కామెంట్రీ వస్తుంది.
The iconic trio of Indian cricket! 🇮🇳🐐
MS Dhoni in the stands as Rohit Sharma and Virat Kohli take the field at Edgbaston. ❤️📸#ENGvIND #ODIs #Sportskeeda pic.twitter.com/HgTVZsSDqS
— Sportskeeda (@Sportskeeda) July 14, 2026