E-Paper
Advertisement

Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?

Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు(Bucchi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనులను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి… చికిరి సాంగ్ విడుదల చేయడంతో ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం రాంచరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.

సందీప్ రెడ్డితో చరణ్ సినిమా లేనట్లేనా?

త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత చరణ్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన బోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. నిజానికి పెద్ది సినిమా తర్వాత రాంచరణ్ సుకుమార్(Sukumar) సినిమా పనులలో బిజీ కావాల్సి ఉంది కానీ ఈ సినిమాకి కూడా బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. పెద్ది సినిమా విడుదలైన అనంతరం రామ్ చరణ్ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారు.

పుట్టబోయే పిల్లల కోసం సినిమాలకు బ్రేక్..

ఈ తరుణంలోనే తదుపరి ప్రాజెక్టులు కూడా కాస్త ఆలస్యం అవుతాయని స్పష్టమవతుంది. అయితే చరణ్ బ్రేక్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తన భార్య ఉపాసన(Upasana) ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె వచ్చే ఏడాదిలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఉపాసన డెలివరీ టైమ్ లో రామ్ చరణ్ పూర్తిగా తన సమయాన్ని తన భార్య పుట్టబోయే పిల్లలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట అందుకే సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా క్లిన్ కారా జన్మించిన సమయంలో కూడా చరణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి సమయాన్ని తన భార్య బిడ్డతో గడిపిన సంగతి తెలిసిందే.

కవలలకు జన్మనివ్వబోతున్న ఉపాసన..

ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొంత గ్యాప్ తర్వాతనే సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ తిరిగి బిజీ కానున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రంగస్థలం సీక్వెల్ గా రాబోతోందని వార్తలు కూడా బయటకు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలబడలేదు. ఇక సందీప్ రెడ్డితో సినిమా చేయబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, ఈ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం అవుతుంది.

Also Read: Rashmika -Vijay : ఎంగేజ్మెంట్ తర్వాత ఒకే స్టేజ్‌పైకి విజయ్ – రష్మిక… గుడ్ న్యూస్ లోడింగా ?

Related News

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

Big Stories

×