E-Paper
Advertisement

Ranveer Singh: ‘కాంతార’ వ్యాఖ్యల వివాదంపై హైకోర్టులో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్..

Ranveer Singh: ‘కాంతార’ వ్యాఖ్యల వివాదంపై హైకోర్టులో క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్..
Advertisement

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఒక అంతర్జాతీయ వేదికపై చేసిన వ్యాఖ్యలు చిక్కుల్లో పడేశాయి. 2025లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) ముగింపు వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ, రిషబ్ శెట్టి నటనను ‘కాంతార’ సినిమాను ప్రశంసించారు. అయితే, ఆ క్రమంలో సినిమాలోని పవిత్రమైన ‘చావుండి దైవాన్ని’ ఉద్దేశించి ఆయన “ఫీమేల్ ఘోస్ట్” అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలు తీర ప్రాంత కర్ణాటక ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దైవారాధనను అవమానించారంటూ బెంగళూరులో ఆయనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్‌వీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

Read also-Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడంపై హైకోర్టు కీలక తీర్పు.. ఏం జరిగిందంటే?

కోర్టు ఆగ్రహం

Advertisement

జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి రణ్‌వీర్ సింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. “మీరు ఒక సెలబ్రిటీ. కోట్ల మంది మిమ్మల్ని అనుసరిస్తారు. అలాంటప్పుడు మీ మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోవాలి. పవిత్రమైన దైవాన్ని దెయ్యం అనడం క్షమించరాని నేరం. తెలియకపోతే తెలుసుకోవాలి కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు” అని కోర్టు హెచ్చరించింది. రణ్‌వీర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అది కేవలం నటుడి పట్ల ఉన్న అభిమానంతో అన్న మాటలే తప్ప, కావాలని చేసినవి కావని, ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారని వివరించారు.

Read also-Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు దగ్గరవుతున్న ధీరజ్.. కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రేవతి.. ధీరజ్ ఎంట్రీతో సీన్ రివర్స్..

చాముండి కొండలకు వెళ్లి క్షమాపణలు

Advertisement

విచారణలో రణ్‌వీర్ సింగ్ ఒక కీలక నిర్ణయాన్ని కోర్టుకు వెల్లడించారు. కేవలం సోషల్ మీడియాలో క్షమాపణలు చెబితే భక్తుల బాధ తీరదని గ్రహించిన ఆయన, వ్యక్తిగతంగా కర్ణాటకలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. తను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తానని తెలిపారు. మైసూరులోని ప్రసిద్ధ చాముండి హిల్స్ క్షేత్రాన్ని దర్శించి, అక్కడ అమ్మవారికి స్థానిక సంప్రదాయాలకు క్షమాపణలు తెలియజేస్తానని రణ్‌వీర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, రణ్‌వీర్‌పై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. కళాకారులు లేదా సెలబ్రిటీలు ఇతర ప్రాంతాల సంస్కృతులు మరియు విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు ఎంతటి బాధ్యతతో ఉండాలో ఈ ఘటన మరొకసారి గుర్తుచేసింది. కోర్టు ఆదేశాల మేరకు రణ్‌వీర్ సింగ్ తన పశ్చాత్తాపాన్ని ఎలా వ్యక్తపరుస్తారో వేచి చూడాలి.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×