Rashmika Mandanna: హైదరాబాద్లో ఉగాది పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ 2025 కార్యక్రమం.. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ తారలు, ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించినది హీరోయిన్ రష్మిక మందన్న. ముఖ్యంగా ఆమెకు వచ్చిన అవార్డు మాత్రమే కాదు, ఆమె ప్రవర్తన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు ఉత్తమ హీరోయిన్ అవార్డును అందుకుంది. ఈ అవార్డు ఆమె కెరీర్లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె పెళ్లయిన వెంటనే ఈ అవార్డు అందుకోవడం ఆమె అభిమానులను మరింత ఆనందానికి కురిచేస్తుంది. ఇక ఈ ఈవెంట్ కోసం..సింపుల్గా, చీరలో హాజరైన రష్మిక ఎంతో అందంగా కనిపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె లుక్ గురించి అభిమానులు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వేడుకకు రష్మిక.. విజయ్ దేవరకొండ తల్లితో కలిసి రావడం అందరినీ ఆకట్టుకుంది. రష్మిక తన అత్తతో ఈ కార్యక్రమానికి వచ్చింది. ఇక వీళ్లిద్దరు వస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఇద్దరిని ఫోటోలు తీయడం ప్రారంభించారు.
ఇద్దరూ కలిసి కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత.. విజయ్ దేవరకొండ తల్లి.. నవ్వుతూ రష్మికను ఫోటోలు తీయండి అంటూ పక్కకు జరిగింది. ఈ చిన్న సంఘటన అక్కడున్న వారందరికి చాలా క్యూట్గా అనిపించింది. ఇలా పెళ్లయిన వెంటనే భర్తతో కాకుండా ఏకంగా అత్తతో వచ్చి అందరిని తెగ ఆకట్టుకుంది ఈ హీరోయిన్.
ఇక ఆ తర్వాత రష్మిక కూడా ఫోటోగ్రాఫర్లకు మంచి స్టిల్స్ ఇచ్చింది. ఈ సందర్భంలో ఆమె.. విజయ్ దేవరకొండ తల్లి మధ్య ఉన్న స్నేహం అందరిని చాలా ఆకట్టుకుంది. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అంతేకాకుండా ఈ అవార్డుల ఫంక్షన్ కి.. నాగచైతన్య.. అతని భార్య శోభిత.. నాగార్జున, అమల కూడా హాజరయ్యారు. ఎంతోమంది సెలబ్రిటీలతో ఈ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.
ALSO READ: Sobhita: ఉగాది పచ్చడి వండలేదు.. సమంతకు శోభిత పంచ్..?