E-Paper
Advertisement

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ కోసం పల్లకిలో వచ్చిన రష్మిక.. ఆ సీన్ ని రీ క్రియేట్ చేస్తూ..!

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ కోసం పల్లకిలో వచ్చిన రష్మిక.. ఆ సీన్ ని రీ క్రియేట్ చేస్తూ..!
Advertisement

Rashmika Mandanna: రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల మధ్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఈ పెళ్లి ఘనంగా జరిగింది.

ఆ సీన్ రీ-క్రియేట్ చేస్తూ..!

పెళ్లి రోజు రష్మిక పాల్కీ లోకి కూర్చుని రావడం అందరి మనసులను దోచుకుంది. సంప్రదాయ దుస్తుల్లో, చిరునవ్వుతో ఆమె కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వేళ్లతో హార్ట్ సైన్ చేస్తూ రష్మిక ఇచ్చిన పోజ్ పెళ్లి ఫోటోల్లో ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీతాగోవిందం సినిమాలో మొదటి పాటలు రష్మిక ఇలానే పల్లకిలో వస్తుంది. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అదే సీన్ రీ క్రియేట్ చేస్తూ వీళ్ల పెళ్లి జరగడంతో.. అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఆ ఫోటోలు హైలెట్..!

Advertisement

వివాహ వేదిక అలంకరణ చాలా అందంగా రూపొందించారు. సంప్రదాయ విలువలకు తగ్గట్టుగా, అదే సమయంలో ఆధునిక టచ్‌తో డెకరేషన్ చేశారు. పూల అలంకరణలు, మట్టి రంగుల థీమ్, పాతకాలపు పిత్తల దీపాలు వేదికకు ప్రశాంతతను ఇచ్చాయి. మండపం మొత్తం ఒక ఆత్మీయ వాతావరణాన్ని చూపించింది. విజయ్, రష్మిక పేర్ల మొదటి అక్షరాలతో రూపొందించిన ‘వీఆర్’ డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెళ్లి డెకర్‌కు సంబంధించిన కొన్ని చూడని ఫోటోలను డెకరేషన్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి.

తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ రష్మిక చాలా భావోద్వేగంగా ఒక సందేశం రాసింది. “ఇప్పటి నుంచి నా భర్త విజయ్ దేవరకొండ” అని ఆమె పేర్కొంది. నిజమైన ప్రేమ అంటే ఏమిటో, మనసులో శాంతి ఎలా ఉంటుందో విజయ్ తనకు నేర్పాడని చెప్పింది. పెద్దగా కలలు కనడం తప్పు కాదని రోజూ తనకు గుర్తు చేశాడని, తనలో ఉన్న శక్తిని నమ్మేలా చేశాడని తెలిపింది. తన జీవితంలో తాను కలలుగన్న మహిళగా మారడానికి విజయ్ ప్రధాన కారణమని రష్మిక భావోద్వేగంగా వెల్లడించింది.

Advertisement

రష్మిక, విజయ్ చాలా కాలం పాటు తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని చెప్పారు. అయితే 2020 నుంచి ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 2022లో వారి గురించి పుకార్లు మరింత బలంగా వినిపించాయి. అయినా ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇప్పుడు ఈ జంట వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో లైకులు, షేర్లు పొందుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ పెళ్లి ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పొచ్చు.

ALSO READ: The Kerala Story 2 Collections: కేరళ స్టోరీ 2 మొదటి రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×