Regina Cassandra: ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రముఖ నటి రెజీనా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మీడియాతో ఆమెకు చిన్నపాటి సంభాషణ జరిగింది. అయితే ఆ సమయంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.
ఈ ఈవెంట్లో ఫోటోగ్రాఫర్లు లైటింగ్కు చాలా దగ్గరగా నిలబడ్డారు. దీనివల్ల లైట్లు బ్లాక్ అవుతున్నాయని రీజినా గమనించారు. ఆమె ఎలాంటి ఆగ్రహం లేకుండా, చాలా శాంతంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. “లైట్ల ముందు మీరు నిలబడితే ఫోటోలు సరిగా రావు అన్న. మీకు కూడా మంచి పిక్చర్లు రావు అన్న” అని సున్నితంగా వివరించారు. ఆమె మాటల్లో ఎక్కడా కోపం లేదు. గొంతెత్తడం లేదు. చాలా మర్యాదగా తన అభిప్రాయాన్ని చెప్పింది.
అంతేకాదు, ఫోటోగ్రాఫర్లకు భరోసా కూడా ఇచ్చారు. “అందరికీ ఫోటోలు ఇస్తాను. కొంచెం వేచి ఉండండి అన్న. క్రమశిక్షణగా ఉంటే అందరికీ మంచిది” అని చెప్పారు. ఈ మాటలతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు.
ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు రీజినా వ్యవహార శైలిని ప్రశంసిస్తున్నారు. “ఇలా మర్యాదగా చెప్పడమే నిజమైన ప్రొఫెషనలిజం” అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు చిన్న విషయాలకే కోపం చూపిస్తారని, కానీ రీజినా మాత్రం చాలా పరిపక్వంగా స్పందించిందని అభిప్రాయపడుతున్నారు.
రీజినా కాసాండ్రా ఇప్పటివరకు తన నటనతోనే కాదు..తన వ్యక్తిత్వంతో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సంఘటన కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మీడియాతో ఎలా మాట్లాడాలి, సమస్యను ఎలా శాంతిగా పరిష్కరించాలి అనే విషయంలో ఆమె ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.
Also Read: Tollywood New Trend: హీరో ఇమేజ్ పక్కన పెడితే కాసుల వర్షమే..టాలీవుడ్లో మారుతున్న ట్రెండ్