Rishab Shetty: రిషభ్ శెట్టి.. రిషభ్ శెట్టి..రిషభ్ శెట్టి..ఎక్కడ చూసినా ఈ పేరే ఇప్పుడు రీ సౌండ్ చేస్తుంది.కాంతారా సిరీస్ తెచ్చిన క్రేజ్ అలాంటిది మరి.కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఇండియా కల్చర్ కి మరింత గుర్తింపు తెచ్చిన ఈ శాండల్ వుడ్ స్టార్ తాజాగా అమిత్ షాని డిల్లీలో కలవడం అటు పొలిటికల్ వర్గాల్లో,ఇటు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం
ఇక అమిత్ షాని కలిసిన తర్వాత తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు రిషబ్.ఈ మీటింగ్ తన లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేని మెమొరీ అని తెలిపాడు.”అమిత్ షా గారితో గడిపిన సమయం అద్భుతం. ముఖ్యంగా ‘కాంతార’, ‘కాంతార: చాప్టర్ 1’సినిమాల గురించి ఆయన మాట్లాడటం, ఆ చిత్రాలను ప్రశంసించడం నాకు గూస్బంప్స్ తెప్పించింది” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు రిషబ్.
సినిమాల గురించి హోంమంత్రికి అంత అవగాహనా?
ఇక ఈ మీటింగ్ లో కేవలం పాలిటిక్స్ మాత్రమే కాకుండా ఇండియన్ హిస్టరీ, కల్చర్, ఆర్ట్ తో పాటు సినిమా మేకింగ్ టెక్నిక్స్ గురించి అమిత్ షా మాట్లాడటం తనని షాక్ కి గురిచేసింది అని చెప్పుకొచ్చాడు.మన మూలాలను సిల్వర్ స్క్రీన్ పై ఎలా ప్రెజెంట్ చేయాలి అనే విషయంలో అమిత్ షా ఇచ్చిన సలహాలు, సినిమాల పట్ల అతనికి ఉన్న ఇంట్రెస్ట్ రిషబ్ ని ఫిదా చేశాయని సమాచారం.ఇక రిషబ్ తను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో హోంమంత్రికి వివరించాడని తెలుస్తుంది.
also read:30 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. డెల్టా ఫ్లైట్లో ఏం జరిగిందంటే?
‘జై హనుమాన్’ నుంచి ‘శివాజీ’ వరకు!
ఇక రిషబ్ కెరీర్ విషయానికి వస్తే పీక్ స్టేజ్లో ఉన్నట్టే కనిపిస్తుంది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోతున్న మెగా ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’లో రిషభ్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కూడా. దీనితో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో కూడా ఆయన నటిస్తున్నాడు .దీంతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రిషభ్ ఈ మధ్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా .
కాంతార 3’ ఇప్పట్లో లేనట్టేనా?
ఇక అమిత్ షాతో జరిగిన మీటింగ్ లో ‘కాంతార’ఫ్రాంచైజీ టాపిక్ వచ్చినప్పటికీ ఫ్యాన్స్ కు ఒక చేదు వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం రిషభ్ శెట్టి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ‘కాంతార ఫ్రాంచైజీ తో సూపర్ హిట్ అయినప్పటికీ హోంబలే ఫిలిమ్స్ వారితో రిషబ్ కి సింక్ అవకపోవడంతో ‘కాంతార 3’ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది.
వైరల్ అవుతున్న ఫోటోలు!
ఇదిలా ఉంటె నెట్టింట రిషభ్ శెట్టి, అమిత్ షా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయ్.చూడాలి మరి ఈ మీటింగ్ సినిమా సినిమా విశేషాల వద్దే ఆగిపోతుందా లేక మరో ముందడుగు వేసి రిషబ్ ని డిల్లీ బాట పట్టిస్తుందా !
also read:త్రిషను కావాలనే పక్కన పెట్టారా? ఆ ఆడియో లాంచ్లో అసలు ఏం జరిగింది? షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్!