E-Paper
Advertisement

Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!

Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!
Advertisement

Rishabh shetty: రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ పేరు కన్నడ ఇండస్ట్రీతోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్మోగుతుంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది .ప్రతి ఒక్క చోట ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాని థియేటర్లలో రికార్డు చేయొద్దు..

ఇకపోతే ఈ సినిమా థియేటర్లో చూసిన కొంతమంది ప్రేక్షకులు అక్కడ వీడియోలను రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై తాజాగా నటుడు రిషబ్ శెట్టి (Rishabh shetty)స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులను అభిమానులను అభ్యర్థిస్తూ.. ప్రియమైన అభిమానులు ప్రేక్షకులకు మనవి. కాంతార చాప్టర్ 1 సినిమా మాది మాత్రమే కాదు మీది కూడా. ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరుపు రానిది. అయితే కొంతమంది ఈ సినిమాని థియేటర్లలో రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పైరసీని ప్రోత్సహించవద్దు..

Advertisement

దయచేసి ఎవరు కూడా ఇలా సినిమాని రికార్డ్ చేస్తూ వీడియోలు తీయొద్దని అలాగే పైరసీని ప్రోత్సహించవద్దని సవినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాంతార వంటి ఒక గొప్ప సినిమాని థియేటర్లో చూసి ఆ అనుభూతిని పొందండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ అభిమానులను అభ్యర్థిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా పైరసీ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి పైరసీని అరికట్టడం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు.

Advertisement

ఇలా థియేటర్లలో సినిమాలను రికార్డు చేయడం వల్లే పైరసీలు కూడా జరుగుతున్నాయని వాటిని ప్రోత్సహించవద్దు అంటూ ఈ సందర్భంగా రిషబ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)నటించగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోంభళే ఫిలిమ్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం సుమారు 125 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. ఇక కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల రిషబ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Also Read: Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×