E-Paper
Advertisement

Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!

Rishabh shetty: ప్లీజ్ థియేటర్ లో ఆ పని చేయొద్దు… ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి!

Rishabh shetty: రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ పేరు కన్నడ ఇండస్ట్రీతోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్మోగుతుంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది .ప్రతి ఒక్క చోట ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాని థియేటర్లలో రికార్డు చేయొద్దు..

ఇకపోతే ఈ సినిమా థియేటర్లో చూసిన కొంతమంది ప్రేక్షకులు అక్కడ వీడియోలను రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై తాజాగా నటుడు రిషబ్ శెట్టి (Rishabh shetty)స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులను అభిమానులను అభ్యర్థిస్తూ.. ప్రియమైన అభిమానులు ప్రేక్షకులకు మనవి. కాంతార చాప్టర్ 1 సినిమా మాది మాత్రమే కాదు మీది కూడా. ఈ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరుపు రానిది. అయితే కొంతమంది ఈ సినిమాని థియేటర్లలో రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పైరసీని ప్రోత్సహించవద్దు..

దయచేసి ఎవరు కూడా ఇలా సినిమాని రికార్డ్ చేస్తూ వీడియోలు తీయొద్దని అలాగే పైరసీని ప్రోత్సహించవద్దని సవినయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాంతార వంటి ఒక గొప్ప సినిమాని థియేటర్లో చూసి ఆ అనుభూతిని పొందండి అంటూ ఈ సందర్భంగా రిషబ్ అభిమానులను అభ్యర్థిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా పైరసీ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి పైరసీని అరికట్టడం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు.

ఇలా థియేటర్లలో సినిమాలను రికార్డు చేయడం వల్లే పైరసీలు కూడా జరుగుతున్నాయని వాటిని ప్రోత్సహించవద్దు అంటూ ఈ సందర్భంగా రిషబ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమాలో రిషబ్ కు జోడిగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)నటించగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హోంభళే ఫిలిమ్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం సుమారు 125 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. ఇక కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇటీవల రిషబ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Also Read: Aishwarya -Abhishek: వారి పై రూ. 4 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఐశ్వర్య దంపతులు..ఇదే కారణమా?

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×