E-Paper
Advertisement

SambaralaYeti Gattu: సంబరాల ఏటిగట్టు ఒక్క ఎపిసోడ్ కోసంరూ. 20 కోట్లు.. రిస్క్ చేస్తున్న నిర్మాతలు?

SambaralaYeti Gattu: సంబరాల ఏటిగట్టు ఒక్క ఎపిసోడ్ కోసంరూ. 20 కోట్లు.. రిస్క్ చేస్తున్న నిర్మాతలు?
Advertisement

SambaralaYeti Gattu: మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా మెగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga tej)ఒకరు. సాయిదుర్గ తేజ్ చివరిగా బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన సంబరాల ఏటిగట్టు (SambaralaYeti Gattu) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రోహిత్ కెపి ఇండస్ట్రీకి పరిచయమవుతూ తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అసుర ఆగమనం అంటూ..

రాయలసీమ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఒక గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్నారు. అయితే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సంబరాల ఏటిగట్టు సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా..

Advertisement

ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడ వెనకడుగు వేయడం లేదని చెప్పాలి. కేవలం ఒక క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ 35 రోజుల లాంగ్ షెడ్యూల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ లో మొత్తం 18 గ్రాండ్ సెగ్మెంట్స్‌ను ప్లాన్ చేశారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తు చేసేలా పవర్‌ఫుల్ రిఫరెన్స్ కూడా క్లైమాక్స్‌లో ఉండబోతుందనీ సమాచారం. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

క్లైమాక్స్ కోసం రూ 20 కోట్లు..

Advertisement

ఇలా ఒక్క ఎపిసోడ్ కోసమే 20 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా విషయంలో చిత్ర నిర్మాతలు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి . విరూపాక్ష సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గ తేజ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో సాయిదుర్గ తేజ్ జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా, అనన్య నాగళ్ళ, జగపతిబాబు వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

Also Read: Varun Tej -Lavanya:వెడ్డింగ్ వేడుకలో వారసుడితో ఆటలు… వరుణ్ దంపతుల వీడియో వైరల్

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×