Sonali Bendre: బాలీవుడ్ సీనియర్ నటి సోనాలి బిం,ద్రే ఆమె భర్త, నిర్మాత గోల్డీ బెహ్ల్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక రైతుకు చెందిన భూమిని వీరు అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పుణే సమీపంలోని లోనావాలా ప్రాంతంలో సోనాలి బింద్రే కుటుంబానికి కొంత భూమి ఉంది. అయితే, తమ పొలానికి ఆనుకుని ఉన్న భూమిని సోనాలి బింద్రే దంపతులు ఆక్రమించారని, అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఒక స్థానిక రైతు పోలీసులకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు రైతు ఆరోపణల ప్రకారం.. సోనాలి దంపతులు తమ భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించే క్రమంలో తన పొలానికి వెళ్లే దారిని మూసివేశారని, అలాగే తన పట్టా భూమిలో కొంత భాగాన్ని కూడా కలిపేసుకున్నారని పేర్కొన్నారు. దీనివల్ల తాను వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నానని, న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
Read also-‘బ్రహ్మముడి’ సీరియల్ ఏఫ్రిల్ 3: కిడ్నాప్ గురించి రాజు, లక్కీలకు చెప్పిన ఐశ్వర్య
ఈ ఆరోపణలపై సోనాలి బింద్రే గోల్డీ బెహ్ల్ వెంటనే స్పందించారు. ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని వారు కొట్టిపారేశారు. ఈ మేరకు వారు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, తాము ఏనాడూ చట్టాన్ని అతిక్రమించలేదని స్పష్టం చేశారు. సోనాలి బింద్రే స్పందిస్తూ, “ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. మేము ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశాము. మా వద్ద అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్లాన్ కాపీలు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఆ రైతు మమ్మల్ని వేధించడానికి, మా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడానికి ఈ విధంగా చేస్తున్నాడు” అని తెలిపారు. సెలబ్రిటీలం కావడం వల్లే తమను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదం అధికారుల వద్దకు వెళ్లడంతో, రెవెన్యూ శాఖ అధికారులు భూమి కొలతలు నిర్వహించాలని నిర్ణయించారు. రికార్డుల ప్రకారం ఆ భూమి ఎవరికి చెందుతుంది? సరిహద్దుల విషయంలో ఎక్కడ పొరపాటు జరిగింది? అనే విషయాలను సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత తేల్చనున్నారు. సినీ రంగంలో హుందాతనానికి మారుపేరుగా నిలిచే సోనాలి బింద్రేపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది కేవలం భూమి సరిహద్దు గొడవా లేక నిజంగానే ఎవరైనా బాధితులు ఉన్నారా అనేది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సోనాలి టీమ్ మాత్రం ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.