E-Paper
Advertisement

Bollywood Movies : హిందీ సినిమాలపై నిషేధం… అసెంబ్లీలో బిల్లు.. సీఎం సంచలన నిర్ణయం

Bollywood Movies : హిందీ సినిమాలపై నిషేధం… అసెంబ్లీలో బిల్లు.. సీఎం సంచలన నిర్ణయం
Advertisement

Banning on Hindi Movies Songs: త్రిభాషా సూత్రం వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఎంతోకాలంగా వివాదం నెలకొసాగుతున్న సంగతి తెలిసిందే. నేపథ్యంలో నేడు హిందీ భాషకు వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా హిందీ బోర్డులు, పాటలు, సినిమాలు, హోర్డింగ్స్ని నిషేధించేందుకు బిల్లు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రతిపాదన చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్అత్యవసర సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం అత్యవసర సమావేశం

Advertisement

న్యాయ నిపుణులు, ప్రభుత్యం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దడం, రాష్ట్రంలో హిందీ భాష ప్రాముఖ్యతను తగ్గించడమే కాకుండ.. హిందీ బోర్డులు, సినిమాలు, పాటలు, హోర్డింగ్స్ ని నిషేధించాలనే ఉద్దేశంతో బిల్లును రూపొందించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగానికి లోబడే బిల్లు తయారు చేసినట్టు సమాచారంఅధికార డీఎంకే తీసుకున్న ఈ చర్య హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ద్రవిడ ఉద్యమం నుంచి వస్తున్న సుదీర్ఘ పోరాటాన్ని ఇది మరింత బలోపేతం చేసేలా ఉంది.

రాజ్యాంగానికి లోబడే..

తమిళ భాష, సంస్కృతిని రక్షించడానికే బిల్లును పెడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బిల్లులో ఎక్కడ రాజ్యాంగంలలోని నిబంధనలు తప్పలేదని, రాజ్యాంగానికి అనుగుణంగానే రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343-351 కింద ఆంగ్లాన్ని సహ-అధికారిక భాషగా కొనసాగిస్తుందని ఎంకే స్టాలిన్ప్రభుత్వం వెల్లడించిందిహిందీ భాషను తమిళ ప్రజలపై బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తోన్న విషయం విధితమే. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ ఇటీవలే ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

Also Read: Rishab Shetty : బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి

సెప్టెంబర్‌ 9న రాష్ట్రపతికి ఈ కమిటీ నివేదించిన సిఫారసులను తమిళులు సహా ఇతర రాష్ట్రాల్లో భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని సీఎం ఎంకే స్టాలిన్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంతోపాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలకు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే డీఎంకే పెట్టబోతున్న బిల్లుపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వ చర్యపై బీజేపీ నేత వినోజ్సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను రాష్ట్రంలో నిషేధించేందుకు బిల్లు అని, ఇది డీఎంకే ముర్ఖపు చర్య అని ఆయన ధ్వజమెత్తున్నారు. భాషను రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని, ఇది డీఎంకే తెలివి తక్కువ చర్యకు నిదర్శనమన్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×