Akhanda2: అఖండ 2 టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర హోంశాఖ స్పందించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు సమాచారం అందించింది. అఖండ2 టికెట్లను ఎక్కువ ధరకు విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
హీరో బాలకృష్ణ నటించిన ‘అఖండ 2 తాండవం’ మూవీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా మరో బిగ్ షాక్ తలిగింది. ప్రీమియం షోకు ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
బాలయ్య అఖండ2కు తెలంగాణ సర్కార్ స్పెషల్ షోతో పాటు టికెట్లు ధరలు పెంచుతూ జీవో చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో హైకోర్టు రద్దు చేసింది. అఖండ 2కు డిసెంబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజులు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ పై రూ.50, మల్టీఫ్లెక్స్లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్ 11న ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని ప్రభుత్వం షరతు విధించింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేసింది.
Also Read: Akhanda 2 : రూమర్లు నమ్మకండి తాండవం ఎంజాయ్ చేయండి, రంగంలోకి నిర్మాతలు
అఖండ2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ విడుదలపై చెన్నై హైకోర్టు స్టే విధించింది. 14 రీల్స్ సంస్థ నుంచి నగదు రావాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే పూర్తి విచారణ అనంతరం మూవీ రిలీజ్కు అనుమతి ఇచ్చింది. చివరికి ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది.