E-Paper
Advertisement

Vijay Thalapathi: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. మనసు ముక్కలైందంటూ!

Vijay Thalapathi: కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. మనసు ముక్కలైందంటూ!
Advertisement

Vijay Thalapathi:తమిళనాడులోని కరూర్ లో టీవీకే అధినేత విజయ్ దళపతి (Vijay Thalapathi) నిర్వహించిన ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఏకంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 10మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచి వేస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడగా అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే విజయ్ ప్రసంగాన్ని నేరుగా చూడాలి అని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. దాంతో తొక్కిసలాట జరగగా చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి.. కొంతమందికి స్వయంగా ఆయనే వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.

కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్..

అయితే పరిస్థితి చేజారిపోవడంతో చాలామంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ కొంతమందిని అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఇకపోతే ప్రస్తుతం కొంతమంది హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై టీవీకే అధినేత ప్రముఖ హీరో విజయ్ దళపతి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.

Advertisement

ఈ ఘటనతో మనసు ముక్కలైంది – విజయ్

కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేస్తూ.. “ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది. దుఃఖం, బాధలో మునిగిపోయాను. ఈ బాధ వర్ణనాతీతం. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ విజయ్ ప్రకటించారు.

Advertisement

also read:Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!

విజయ్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్..

ఇకపోతే ఈ ఘటన జరగడంతో హీరో విజయ్ ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డిఎంకె, ఏఐడీఎంకే కాంగ్రెస్ నేతలు విజయ్ ను అరెస్టు చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ టీవీకే నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

విజయ్ అరెస్ట్ పై సీఎం స్టాలిన్ ఏమన్నారంటే?

మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు.. తొక్కిసలాట తర్వాత హుటాహుటిన నిన్న రాత్రి కరూర్ కి చేరుకున్న ఆయన ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. హాస్పిటల్లో బాధితులతో మాట్లాడిన ఆయన.. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ..” ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు నేను చేయదలచుకోలేదు. బాధితులకు సహాయం అందించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. ఘటనపై విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ ఘటనపై విజయ్ ను అరెస్టు చేస్తారా? లేదా? అనే విషయంపై కూడా ఇప్పుడు నేను మాట్లాడను అంటూ స్టాలిన్ స్పష్టం చేశారు.

స్పందించిన పలువురు రాజకీయ ప్రముఖులు..

ఈ ఘటనపై దేశ ప్రధానమంత్రి మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×