Varalakshmi sarath kumar: ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల దర్శకురాలిగా మారి ఎస్.సరస్వతి అనే సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి ఆరవ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది .అయితే ఈ సినిమా విషయంపై ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కథతో మొదలయ్యి వేరే కథతో పూర్తి అవుతుంది. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. నా కథను మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు..నా సోల్ వేరు అసలా కథ వేరు అంటూ సాయి మాధవ్ సోషల్ మీడియా వేదికగా సినిమా పేరు ప్రస్తావించకుండా పోస్ట్ చేశారు.
ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన కచ్చితంగా వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతీ సినిమా గురించి మాట్లాడారని స్పష్టమవుతుంది.. ఇక ఇదే విషయంపై తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి వరలక్ష్మికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్ సమాధానం చెబుతూ.. సాయి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. మేము ఆయనకు ఈ సినిమా విషయంలో డబ్బులు కూడా ఇచ్చామని తెలిపారు. ఈ సినిమా విషయంలో అసలేం జరిగిందనే విషయాల గురించి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..
ఈ సినిమా కథ మాకు సారు పూర్తిగా చెప్పలేదు ఆయన మొదట్లో కాస్త వినిపించారు తర్వాత ఆయనకు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయని చెప్పేసి ఆ సినిమా పనుల కోసం వెళ్లారు. మేము కథ సిద్ధం చేసేటప్పుడు ఒక్క సిట్టింగ్ కు రాలేదు. ఆయనకు పెద్ద సినిమాలు వస్తున్నాయని చెబితే మేము కూడా సైలెంట్ అయ్యాము కానీ ఈ సినిమా విషయంలో రే** అనే పదం వాడటం సరైనది కాదని వరలక్ష్మి తెలిపారు. రే** అనే పదం వాడి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ పై మాట్లాడటం సరికాదని వరలక్ష్మి శరత్ కుమార్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
నేను ఎవరి కథ దొంగలించలేదు..
ఇక నేను ఎవరి కథను కూడా దొంగలించలేదని, కాంట్రాక్టు వేసి డబ్బులు ఇచ్చి ఈ కథను తీసుకున్నానని తెలిపారు. ప్రేక్షకులకు ఉన్నది ఉన్నట్టు తీస్తే నచ్చదు.ఆయన కథ చాలా ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ బాగాలేదు అని చాలా మంది చెప్పారు. ఈ సినిమా కోసం మేము డబ్బులు ఇచ్చి కథ వాడుకున్నప్పటికీ స్క్రీన్ పైన రైటర్ గా ఆయన పేరు వేసా…అది ఆయనకి నేను ఇచ్చే గౌరవం అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా దోస డైరీస్ బ్యానర్ పై వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు ఆమె సోదరి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ద్వారా వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు.
Also Read: Divvala Madhuri: తిరుమల వివాదం స్పందించిన దివ్వెల మాధురి..నేనేం తప్పు చేయలేదంటూ!