Tollywood: ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు కేవలం రాజకీయాలనే కాదు, సినిమా రంగాన్ని కూడా భయపెడుతున్నాయి. పెట్రోల్, బంగారం ధరలు పెరుగుతాయని సామాన్యులు టెన్షన్ పడుతుంటే, టాలీవుడ్ నిర్మాతలు మాత్రం విదేశీ మార్కెట్ ఎక్కడ దెబ్బతింటుందో అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అంటార్కిటికా షెడ్యూల్తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాపై ఈ యుద్ధ నీడలు ఎలా పడబోతున్నాయి? అసలు మన సినిమాలకి, ఆ దేశాలకి సంబంధం ఏంటి? ఆ వివరాలు చూద్దాం..
భారతీయ సినిమాలకు, ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలకు అరబ్ దేశాల్లో (GCC) భారీ మార్కెట్ ఉంది. అక్కడ ఉండే మన భారతీయులతో పాటు స్థానికులు కూడా మన సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అయితే తాజా ఉద్రిక్తతల వల్ల ఆ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. ఇక యుద్ధ వాతావరణం నెలకొంటే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల వందల కోట్ల బిజినెస్ జరగాల్సిన చోట భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భయపడుతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేయబడింది. అంటార్కిటికా వంటి లొకేషన్లకు వెళ్లి షూటింగ్ చేయాలంటే విదేశీ ప్రయాణాలు, లాజిస్టిక్స్ చాలా ముఖ్యం. యుద్ధం వల్ల విమానయాన రంగానికి ఆటంకాలు ఏర్పడితే, చిత్ర బృందం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడం కష్టమవుతుంది. ఇక అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని పెట్టిన భారీ పెట్టుబడులు తిరిగి రావడంపై నిర్మాతలు అయోమయంలో ఉన్నారు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే షూటింగ్ షెడ్యూల్స్ మారే అవకాశం కూడా ఉంది.
సినిమా బడ్జెట్లను తలకిందులు చేయటానికి ఎన్నో కారణాలు వున్నాయి. యుద్ధం ప్రభావంతో డాలర్ విలువ పెరగడం, రూపాయి బలహీనపడటం వంటి ఆర్థిక మార్పులు ,విదేశాల్లో సినిమా హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. యుద్ధం తీవ్రమైతే మార్కెట్ మొత్తం కుప్పకూలుతుందనే భయం వారిలో నెలకొంది. కేవలం వారణాసి మాత్రమే కాదు, విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఈ పరిస్థితులు గమనిస్తూ తమ రిలీజ్ డేట్స్ విషయంలో పునరాలోచనలో పడుతునట్టు సమాచారం.
also read: Vijay – Rashmika: విజయ్ – రష్మిక.. మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే?