E-Paper
Advertisement

Gold:- 10గ్రా. బంగారం 70వేలు… వచ్చే అక్షయ తృతీయ నాటికి కన్ఫార్మ్

Gold:- 10గ్రా. బంగారం 70వేలు… వచ్చే అక్షయ తృతీయ నాటికి కన్ఫార్మ్

Gold:- అనలిస్టుల అంచనా ప్రకారమే… ఈ అక్షయ తృతీయకు పది గ్రాముల బంగారం ధర 60వేలు దాటింది. ఇప్పుడు వచ్చే అక్షయ తృతీయకు ఎంత వరకు పెరుగుతుందన్న అంచనాలు రెడీ చేశారు. దాని ప్రకారం… వచ్చే ఏడాది పది గ్రాముల బంగారం ధర 70వేల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. అలాగే ఉంది కూడా.

ప్రపంచం బాగుంటేనే బంగారం ధర తగ్గుతుంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. అమెరికా సహా యూరప్ దేశాలు రెసిషన్ లోకి వెళ్తున్నాయి. ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ఈజీగా ఏడాది పడుతుంది. అంటే, అప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి.

పైగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతోంది. సో, ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ కింద బంగారాన్నే చూస్తారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. బ్యాంకింగ్ సంక్షోభం పొంచే ఉంది. యుద్ధ భయాలు, టెన్షన్లు తగ్గలేదు. సో, ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే.. మరో ఏడాది కంపల్సరీ. ఈ ఏడాది వరకు పెట్టుబడిదారులు ఆలోచించేది బంగారం గురించే. పైగా ఈమధ్య డిజిటల్ గోల్డ్ లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది.

బంగారం ధర పెరుగుతుంది సరే… కొంటారా. మొన్న అక్షయ తృతీయ వెలవెలబోయింది. హైద‌రాబాద్‌లో ప‌ది గ్రాముల బంగారం 61,040, చెన్నైలో అత్య‌ధికంగా 61,530 ప‌లికింది. సో, ధర భారీగా ఉండడంతో పెద్దగా కొనుగోళ్లు జరగలేదని బులియన్ మార్కెట్ ఎక్ప్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు బంగారం ధర 70వేలు దాటితే… ఇక సామాన్యుడికి బంగారం దూరం అయినట్టే. అప్పుడిక పేపర్ గోల్డ్ తీసుకోవడం, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం తప్ప… బంగారం షాపులకు వెళ్లి గోల్డ్ కొనుక్కోవడం ఉండదంటున్నారు. ఏదేమైనా బంగారం ధర 50వేలు క్రాస్ చేసి, 60వేలు దాటి 70వేల దిశగా వెళ్లోంది. వచ్చే రోజుల్లో 70 వేలు రీచ్ అవడం మాత్రం ఖాయమే. 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×