E-Paper
Advertisement

Gold:- 10గ్రా. బంగారం 70వేలు… వచ్చే అక్షయ తృతీయ నాటికి కన్ఫార్మ్

Gold:- 10గ్రా. బంగారం 70వేలు… వచ్చే అక్షయ తృతీయ నాటికి కన్ఫార్మ్
Advertisement

Gold:- అనలిస్టుల అంచనా ప్రకారమే… ఈ అక్షయ తృతీయకు పది గ్రాముల బంగారం ధర 60వేలు దాటింది. ఇప్పుడు వచ్చే అక్షయ తృతీయకు ఎంత వరకు పెరుగుతుందన్న అంచనాలు రెడీ చేశారు. దాని ప్రకారం… వచ్చే ఏడాది పది గ్రాముల బంగారం ధర 70వేల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. అలాగే ఉంది కూడా.

ప్రపంచం బాగుంటేనే బంగారం ధర తగ్గుతుంది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. అమెరికా సహా యూరప్ దేశాలు రెసిషన్ లోకి వెళ్తున్నాయి. ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ఈజీగా ఏడాది పడుతుంది. అంటే, అప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి.

Advertisement

పైగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతోంది. సో, ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ కింద బంగారాన్నే చూస్తారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. బ్యాంకింగ్ సంక్షోభం పొంచే ఉంది. యుద్ధ భయాలు, టెన్షన్లు తగ్గలేదు. సో, ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే.. మరో ఏడాది కంపల్సరీ. ఈ ఏడాది వరకు పెట్టుబడిదారులు ఆలోచించేది బంగారం గురించే. పైగా ఈమధ్య డిజిటల్ గోల్డ్ లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది.

బంగారం ధర పెరుగుతుంది సరే… కొంటారా. మొన్న అక్షయ తృతీయ వెలవెలబోయింది. హైద‌రాబాద్‌లో ప‌ది గ్రాముల బంగారం 61,040, చెన్నైలో అత్య‌ధికంగా 61,530 ప‌లికింది. సో, ధర భారీగా ఉండడంతో పెద్దగా కొనుగోళ్లు జరగలేదని బులియన్ మార్కెట్ ఎక్ప్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు బంగారం ధర 70వేలు దాటితే… ఇక సామాన్యుడికి బంగారం దూరం అయినట్టే. అప్పుడిక పేపర్ గోల్డ్ తీసుకోవడం, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం తప్ప… బంగారం షాపులకు వెళ్లి గోల్డ్ కొనుక్కోవడం ఉండదంటున్నారు. ఏదేమైనా బంగారం ధర 50వేలు క్రాస్ చేసి, 60వేలు దాటి 70వేల దిశగా వెళ్లోంది. వచ్చే రోజుల్లో 70 వేలు రీచ్ అవడం మాత్రం ఖాయమే. 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×