E-Paper
Advertisement

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీ కొట్టిన బస్సు-12 మంది మృతి

Rajasthan Road Accident: రాజస్థాన్‌లోని ధోల్ పుర్ జిల్లాలో తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. టెంపోను స్లీపర్ బస్సు ఢీకొని 12 మంది మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. కరీం కాలనీకి చెందిన నహ్నూ, జమీర్ కుటుంబ సభ్యులతో కలిసి.. బరౌలీ అనే ప్రాంతంలో వివాహ వేడుకకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి టెంపోలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న స్లీపర్ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదాన్ని గమనించిన  స్ఠానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందగా.. ఇందులో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ పడన వారిలో బస్సు డ్రైవర్ తో పాటు క్లీనర్ ఉన్నట్లు పోలీసులు వెళ్లడించారు.

Also Read:  ఢిల్లీలో బాంబు పేలుడు.. సిఆర్‌పిఎఫ్ స్కూల్ వద్ద ఘటన!

కాగా, మృతి చెందిన వారిని పోస్టుమార్టానికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అడిషనల్ కమల్ కుమార్ జాంగీద్, సబ్ కలెక్టర్ దుర్గా ప్రసాద్ మీనా తదితర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×