E-Paper
Advertisement

Farmers Suicides: 2వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య.. వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Farmers Suicides: 2వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య.. వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Farmers Suicides: మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 10 నెలల్లోనే 2 వేలకు పైగా రైతులు బలవన్మరణం చెందారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కలు అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధికారిక లెక్కల ప్రకారం ఉన్న రైతు ఆత్మహత్యలు.. అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే జరిగినట్లు తేలింది.

ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇందులో అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే 951 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. ఛత్రపతి శంభాజినగర్ డివిజన్ లో 877, నాగ్ పుర్ డివిజన్ లో 257, నాసిక్ డివిజన్ లో 254, పుణె డివిజన్ లో 27 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ భైదాస్ వెల్లడించారు.

కాగా.. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యుడు కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు.. మంత్రి అనిల్ భైదాస్ అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×