BigTV English

Farmers Suicides: 2వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య.. వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Farmers Suicides: 2వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య.. వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Farmers Suicides: మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 10 నెలల్లోనే 2 వేలకు పైగా రైతులు బలవన్మరణం చెందారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కలు అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధికారిక లెక్కల ప్రకారం ఉన్న రైతు ఆత్మహత్యలు.. అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే జరిగినట్లు తేలింది.


ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇందులో అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే 951 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. ఛత్రపతి శంభాజినగర్ డివిజన్ లో 877, నాగ్ పుర్ డివిజన్ లో 257, నాసిక్ డివిజన్ లో 254, పుణె డివిజన్ లో 27 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ భైదాస్ వెల్లడించారు.

కాగా.. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యుడు కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు.. మంత్రి అనిల్ భైదాస్ అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.


Related News

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Big Stories

×