BigTV English
Advertisement

Farmers Suicides: 2వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య.. వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Farmers Suicides: 2వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య.. వెల్లడించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Farmers Suicides: మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 10 నెలల్లోనే 2 వేలకు పైగా రైతులు బలవన్మరణం చెందారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కలు అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. కాగా.. అధికారిక లెక్కల ప్రకారం ఉన్న రైతు ఆత్మహత్యలు.. అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే జరిగినట్లు తేలింది.


ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇందులో అత్యధికంగా అమరావతి డివిజన్ లోనే 951 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. ఛత్రపతి శంభాజినగర్ డివిజన్ లో 877, నాగ్ పుర్ డివిజన్ లో 257, నాసిక్ డివిజన్ లో 254, పుణె డివిజన్ లో 27 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ భైదాస్ వెల్లడించారు.

కాగా.. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యుడు కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు.. మంత్రి అనిల్ భైదాస్ అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.


Related News

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి, భీమవరంలో ఘోరం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Big Stories

×