Big Stories

Odisha Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Road Accident in Odisha(Today news paper telugu): ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బజ్ పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో నేషనల్ హైవే నంబర్ 16పై వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి పై నుంచి క్రింద పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా.. మరో 38 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను కటక్ లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Also Read : జీలం నదిలో ప్రమాదం, బోటులో స్కూల్ స్టూడెంట్స్

- Advertisement -

ప్రయాణికులతో బస్సు పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ ఘనటపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News