E-Paper
Advertisement

Odisha Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Odisha Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Advertisement

Road Accident in Odisha(Today news paper telugu): ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బజ్ పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో నేషనల్ హైవే నంబర్ 16పై వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి పై నుంచి క్రింద పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా.. మరో 38 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను కటక్ లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read : జీలం నదిలో ప్రమాదం, బోటులో స్కూల్ స్టూడెంట్స్

Advertisement

ప్రయాణికులతో బస్సు పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ ఘనటపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరినట్లు పోలీసులు ప్రథమికంగా నిర్థారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×